మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ ఇప్పుడు మాములుగా లేదు. ‘ఆచార్య’ తర్వాత ‘గాడ్ఫాదర్, భోళాశంకర్’ చిత్రాలను విడుదల చేసిన ఆయన.. మరికొద్ది రోజుల్లో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాని కూడా ట్రాక్ చేయబోతున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి. ఇవి కాకుండా మెగాస్టార్ ఇప్పుడు మరో యంగ్ హీరోకి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు వెంకీ కుడుముల. ‘ఛలో’, ‘భీష్మ’ చిత్రాలతో వరుస హిట్లు అందుకున్న వెంకీ, మహేష్, యన్టీఆర్లతో సినిమాలు చేస్తాడని ప్రచారం జరిగింది.
మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ ఇప్పుడు మాములుగా లేదు. ‘ఆచార్య’ తర్వాత ‘గాడ్ఫాదర్, భోళాశంకర్’ చిత్రాలను విడుదల చేసిన ఆయన.. మరికొద్ది రోజుల్లో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాని కూడా ట్రాక్ చేయబోతున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి. ఇవి కాకుండా మెగాస్టార్ ఇప్పుడు మరో యువ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు వెంకీ కుడుముల. ‘ఛలో’, ‘భీష్మ’ చిత్రాలతో వరస హిట్లు అందుకున్న వెంకీ, మహేష్, ఎన్టీఆర్లతో సినిమాలు చేయనున్నాడని ప్రచారం జరిగింది. అయితే అవి కేవలం పుకార్లే అని తేలింది.
‘ఆచార్య’ షూటింగ్ టైమ్లో వెంకీ కుడుముల చిరంజీవికి స్టోరీ లైన్ చెప్పి మెప్పించాడు. పూర్తి స్టోరీ నేరేట్ అయ్యి చిరు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. తుది ముసాయిదాను సిద్ధం చేసి త్వరలోనే సినిమాను ప్రారంభించనున్నట్టు చిరంజీవి తెలిపారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పట్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదు. ‘గాడ్ఫాదర్’, ‘భోళాశంకర్’ చిత్రాలతో పాటు ‘బాబీ’ సినిమాని ఒకేసారి చేయనున్న చిరు.. ఈ మూడు పూర్తయిన తర్వాతే వెంకీ సినిమా చేయబోతున్నాడనే టాక్ ఉంది. మరి వెంకీ.. చిరు కోసం ఎలాంటి కథ రాస్తాడో చూద్దాం.
నవీకరించబడిన తేదీ – 2021-11-21T21:40:13+05:30 IST