పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి జంటగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘భీమ్లానాయక్’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మితమవుతున్న ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రానికి అఫీషియల్ రీమేక్ అనే విషయం తెలిసిందే. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్ట్లో కాస్త మార్పు చేశారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ చెప్పడం విశేషం. ఇప్పటికే విడుదలైన టీజర్స్, సింగిల్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి జంటగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘భీమ్లానాయక్’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మితమవుతున్న ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రానికి అఫీషియల్ రీమేక్ అనే విషయం తెలిసిందే. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్ట్లో కాస్త మార్పు చేశారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ చెప్పడం విశేషం. ఇప్పటికే విడుదలైన టీజర్స్, సింగిల్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా రికార్డుల మోత మోగించడంపై ఫ్యాన్స్ ఇప్పటికే లెక్కలు వేసుకుంటున్నారు.
ఇక తాజాగా ‘భీంలానాయక్’ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా OTT హక్కులను ప్రముఖ OTT కంపెనీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ ధరకు కొనుగోలు చేసింది. సినిమా విడుదలైన 45 రోజుల తర్వాత థియేటర్లలోకి వచ్చేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, మురళీ శర్మ, బ్రహ్మాజీ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
నవీకరించబడిన తేదీ – 2022-02-17T18:20:48+05:30 IST