ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ తీరు
సమయం దాటినా పెద్ద క్యూలు
సాయంత్రం వరకు ఉండాలనుకునే రోగులు
హైదరాబాద్ సిటీ, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాసుపత్రుల్లో ఓపీ సమయం తక్కువగా ఉండడంతో ఎక్కువ మంది రోగులకు వైద్య సేవలు అందడం లేదు. ఎప్పటి నుంచో సమయం పెంచాలని కోరుతున్నా.. ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు పడలేదు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు మాత్రమే ఓపీ పనిచేస్తుంది. ఇటీవల సుల్తాన్బజార్ ప్రసూతి ఆస్పత్రిని సందర్శించిన మంత్రి హరీశ్రావు అక్కడి ఓపీని గమనించారు. దూర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వస్తున్నందున ఓపీ సాయంత్రం 4 గంటల వరకు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కొన్ని ఆసుపత్రుల్లో ఓపీ సమయం ముగిసే సమయానికి ఉదయం 11.30 గంటలకు కూడా కొన్ని ఆస్పత్రుల్లో పెద్ద క్యూలు కనిపిస్తున్నాయి. ఓపీ మూడు గంటలు మాత్రమే ఉండడంతో ఆ సమయంలో 1000 నుంచి 1500 మంది వరకు చూడాల్సి వస్తోంది. సోమ, మంగళవారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రసూతి ఆసుపత్రుల్లో అయితే రోగులు క్యూలో ఉన్నంత సేపు కూడా ఓపీ పనిచేయడం లేదు. కొన్ని చోట్ల సమయం మించిపోయిందని చెప్పి పంపుతున్నారు. ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉండడంతో మహిళలు ఉదయం ఏడు గంటలకే వచ్చి క్యూలో నిల్చున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో కేవలం మూడు గంటలకే పరిమితం కావడంపై రోగులు వాపోతున్నారు. ఎమర్జెన్సీ బ్లాక్ మాదిరిగానే ఓపీ బ్లాక్ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేయాలి. రోగికి ఒకే రోజు ల్యాబ్ పరీక్షలు పూర్తి చేయాలని చాలా మంది కోరుతున్నారు.
సాయంత్రం క్లినిక్లు ఏర్పాటు చేయాలి
ప్రసూతి ఆసుపత్రుల్లో సాయంత్రం కూడా ఓపీ పనిచేసేలా చూడాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ఉదయం పూట సమయాభావం వల్ల వైద్యసేవలు పొందలేకపోతున్నారని, వైద్యసేవలు పొందలేకపోతున్నారని, అందరికీ వైద్యసేవలు అందేలా సాయంత్రం క్లినిక్ లు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. కానీ అధికారులు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
