సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారువారి పాట’ ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. బ్యాంకు రుణాల అక్రమాలపై ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పరశురామ్ తెరకెక్కించారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారువారి పాట’ ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. బ్యాంకు రుణాల అక్రమాలపై ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పరశురామ్ తెరకెక్కించారు. ఈ సినిమా తర్వాత అభిమానుల దృష్టి మహేష్ చేయబోయే సినిమాపైనే ఉంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం మహేష్కి 28వ చిత్రం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్ఎస్ఎంబీ 28 పేరుతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాధాకృష్ణ (ఎస్ రాధాకృష్ణ) నిర్మించబోతున్నారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ మహేష్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో నేచురల్ స్టార్ నాని నటించబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఇందులో వాస్తవం లేదని తేలడంతో మరో వార్త వినిపిస్తోంది. అదేంటంటే.. ఈ సినిమాలో మహేష్ తండ్రి పాత్రలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటిస్తున్నారు. నిజానికి మహేష్ కంటే ఉపేంద్ర ఏడేళ్లు పెద్ద. అలాంటప్పుడు మహేష్ తండ్రిగా ఆయన్నే ఎంపిక చేశారనే వాదన వినిపిస్తోంది. అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోనే ఆ పాత్ర కనిపిస్తుందని అంటున్నారు.
గతంలో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాలో ఉపేంద్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్గా ఉపేంద్ర అద్భుతంగా నటించాడు. అతని భార్యగా స్నేహ నటించింది. తన తండ్రి ఆస్తికి సంబంధించిన కేసును సెటిల్ చేసేందుకు ఉపేంద్ర ఇంటికి వెళ్లిన బన్నీ.. చివరికి అతనిలో మార్పు తీసుకురావడం.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇప్పుడు మరోసారి ఉపేంద్ర త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. మరి నిజానికి ఉపేంద్ర మహేష్ తండ్రి పాత్రలో నటిస్తున్నాడా లేదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
నవీకరించబడిన తేదీ – 2022-07-06T21:16:40+05:30 IST