స్టార్ హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుంటున్న రష్మిక మందన్న ఇప్పుడు రెమ్యునరేషన్ పెంచిందా? ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్టార్ హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుంటున్న రష్మిక మందన్న ఇప్పుడు రెమ్యునరేషన్ పెంచిందా? ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి ‘ఛలో’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రష్మిక మందన్న.. తొలి సినిమాతోనే హిట్ అందుకొని తెలుగులో దర్శకులు, హీరోల దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా తర్వాత చేసిన ‘గీత గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి సినిమాలు రష్మికకు స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టాయి.
దాంతో సౌత్ లాంగ్వేజెస్ , హిందీలో అవకాశాలు దక్కించుకుంటోంది. అయితే ‘పుష్ప’ సినిమా కంటే ముందు రష్మిక మందన్న కోటి వరకు రెమ్యునరేషన్ అందుకోగా ఇప్పుడు నాలుగు కోట్ల వరకు డిమాండ్ చేసిందని వార్తలు వస్తున్నాయి. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో మంచి క్రేజీ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకుంది. ఇటీవలే ‘సీతా రామం’ సినిమాలో అఫ్రీన్ ప్రత్యేక పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ముఖ్యంగా ‘సీతారామ్’ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో రష్మిక గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు తను సైన్ చేయాలనుకున్న కొత్త తెలుగు సినిమాలకు 3 కోట్లు రెమ్యునరేషన్ అడిగాడనీ, హిందీ సినిమాకు 4 కోట్లు అడిగాడనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఒకవైపు నిర్మాతలు సినిమా నిర్మాణ ఖర్చును తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు స్టార్ హీరోలు కూడా తమ రెమ్యునరేషన్ తగ్గించుకుంటారంటూ ఇటీవల కొందరు ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో రష్మిక రెమ్యూనరేషన్పై వస్తున్న వార్త ఆసక్తికరంగా మారింది.
నవీకరించబడిన తేదీ – 2022-08-07T19:59:41+05:30 IST