గుజరాత్, హిమాచల్.. బీజేపీకి

గుజరాత్, హిమాచల్.. బీజేపీకి

అభిప్రాయ సేకరణలో వెల్లడైంది

గాంధీనగర్, సిమ్లా, నవంబర్ 4: ఈ నెలలో ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్, వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో రెండు చోట్లా బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవడం ఖాయమని సర్వేల్లో వెల్లడైంది. హిమాచల్ ప్రదేశ్‌లోని 68 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 12న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో 46 ఓట్లతో 41 సీట్లు గెలుచుకుని బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోనుందని ‘ఇండియా టీవీ-మ్యాట్రిక్స్’ అభిప్రాయ సేకరణలో తేలింది. కాంగ్రెస్ పార్టీ 42 ఓట్లతో 25 స్థానాలకే పరిమితమవుతుందని.. ఆమ్ ఆద్మీ పార్టీకి 2 ఓట్లు మాత్రమే వస్తాయని.. ఒక్క సీటు కూడా రాదని, రెండు సీట్లు ఇతరులకు వస్తాయని ఈ సర్వేలో వెల్లడైంది. హిమాచల్‌లో ఒక్కసారి ఓ పార్టీ గెలిస్తే మళ్లీ మరో పార్టీ గెలుస్తుంది. దాని ప్రకారం ఈసారి అధికారం తమదేనని కాంగ్రెస్ ధీమాగా ఉండగా.. బీజేపీ మాత్రం ప్రధాని మోదీ చరిష్మాకే పెట్టుబడిగా ప్రచారం చేస్తోంది.

ఇక, ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్ విషయానికి వస్తే.. అక్కడ కూడా బీజేపీ తన అధికారాన్ని నిలుపుకుంటుందని టైమ్స్‌నౌ-ఈటీపీ ఒపీనియన్ పోల్ వెల్లడించింది. అధికార బీజేపీ 45 శాతం ఓట్లతో దాదాపు 125 నుంచి 135 సీట్లు గెలుచుకుంటుందని సర్వే అంచనా వేసింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ 21 శాతం ఓట్లతో 29-33 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. గుజరాత్‌లో విజయం సాధించాలని తహతహలాడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీకి 29 శాతం ఓట్లతో 20-24 సీట్లు వస్తాయి. గత ఆరు ఎన్నికల్లో విజయ పరంపర కొనసాగిస్తున్న బీజేపీ ఏడోసారి కూడా విజయ ఢంకా మోగించనుందని సర్వే అంచనా వేయడం గమనార్హం. అలాగే ఏబీపీ-సీవోటర్ ఒపీనియన్ పోల్‌లో గుజరాత్‌లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవడం ఖాయమని తేలింది. గుజరాత్‌లో బీజేపీ 45.5 ఓట్లతో 131 నుంచి 139 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వేలో తేలింది. కాంగ్రెస్ పార్టీ 29.1% ఓట్లతో 31-39 సీట్లు గెలుచుకుంటుందని సర్వే వెల్లడించింది. ఆమ్ ఆద్మీ పార్టీ 20.2% ఓట్లతో 7 నుంచి 15 సీట్లు గెలుచుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *