TSPSC పేపర్ లీక్: ఆమెను 20 గంటలు విచారిస్తే తేలింది!

TSPSC పేపర్ లీక్: ఆమెను 20 గంటలు విచారిస్తే తేలింది!

సమన్వయ లోపంతోనే లీకేజీ!

TSPSC చైర్మన్, సెక్రటరీ, సెక్షన్ ఆఫీసర్ పర్యవేక్షణ కొరవడింది..

పేపర్ల చోరీ కేసు కూడా ఇదే

ఆ ఉద్యోగులకు కస్టడీ ముగిసి.. జైలుకు తరలించారు

హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం అంతా ఆ కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్ సెక్షన్ చుట్టూ తిరుగుతోంది. అత్యంత విశ్వసనీయంగా ఉండాల్సిన ఆ విభాగంలో నిఘా వైఫల్యం ఉన్నట్లు తేలడంతో.. ప్రస్తుతం సిట్ అధికారులు అదే బాటలో విచారణ కొనసాగిస్తున్నారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకరలక్ష్మిని ఇప్పటికే 10 సార్లు సుమారు 20 గంటల పాటు విచారించారు. ప్రశ్నపత్రాల భద్రత, నిందితుడు ప్రవీణ్‌కు యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఎలా తెలిశాయి అనే అంశాలపై వివరాలు సేకరించారు. ఆ తర్వాత TSPSC సెక్రటరీ అనితా రామచంద్రన్‌ను ప్రశ్నించారు.

వీరి నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ భద్రత, పర్యవేక్షణలో చైర్మన్, సెక్రటరీ, సెక్షన్ ఆఫీసర్ మధ్య పూర్తి సమన్వయం లోపించిందని సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఇదే అవకాశంగా భావించిన సెక్రటరీ పీఏ ప్రవీణ్, నెట్‌వర్క్ అడ్మిన్ రాజశేఖర్ రెడ్డి ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణంలో హస్తం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌పై పూర్తి బాధ్యత, అత్యున్నత అధికారం కలిగిన చైర్మన్ జానారెడ్డి నుంచి ఈ విషయమై వివరణ కోరేందుకు సిట్ సిద్ధమైంది. ఆయన వెల్లడించే సమాచారం కీలకంగా మారనుంది. ఈ నెల 11వ తేదీలోగా ఈడీ విచారణ పూర్తి చేసి సీల్డ్ కవర్ లో నివేదికను కోర్టుకు సమర్పించాల్సి ఉండడంతో సిట్ అధికారులు దూకుడు పెంచారు.

TSPSC ఉద్యోగుల కస్టడీ పూర్తి..

గ్రూప్-1 ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టయిన ఇద్దరు టీఎస్పీఎస్సీ ఉద్యోగులు షమీమ్, రమేష్ తోపాటు మాజీ ఉద్యోగి సురేష్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం వీరి కస్టడీ పూర్తికావడంతో పోలీసులు వారికి వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ఇంట్లో హాజరుపరిచి సాయంత్రం చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు ఏఈ ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలో అరెస్టయిన మరో ముగ్గురు నిందితులు ప్రశాంత్, తిరుపతయ్య, రాజేందర్‌లను పోలీసు కస్టడీకి అప్పగించాలని పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. తీర్పును కోర్టు నేటికి వాయిదా వేసింది. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల కస్టడీ ముగియడంతో.. ఈ ముగ్గురు నిందితులను కస్టడీకి అనుమతించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కాగా, గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో 100 మార్కులకు పైగా సాధించిన మొత్తం 121 మంది అభ్యర్థులను సిట్ అధికారులు పిలిపించి విచారించారు. వారి వివరాలు, నేపథ్యాన్ని పరిశీలించారు. వారి సామర్థ్యాలను, ప్రతిభను క్రాస్ చెక్ చేసుకునేందుకు వారి ముందు కొన్ని ప్రశ్నలకు ప్రత్యేకంగా సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. 121 మందిలో న్యూజిలాండ్ నుంచి గ్రూప్-1 పరీక్ష రాసి 103 మార్కులు సాధించిన టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు షమీమ్, రమేష్, మాజీ ఉద్యోగి సురేష్, రాజశేఖర్ రెడ్డి బావమరిది ప్రశాంత్ రెడ్డిలను నిందితులుగా సిట్ వెల్లడించింది. .

నవీకరించబడిన తేదీ – 2023-04-03T12:08:02+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *