WTC ఫైనల్ సమయంలో ‘కంగారు’
లండన్: భారత్తో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు ఆస్ట్రేలియా జట్టు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు ఓవల్లో వారి గత ప్రదర్శన ఆందోళన కలిగిస్తోంది. ఈ మ్యాచ్ ఈ నెల 7 నుంచి 11 వరకు జరగనుంది. 1880లో ఇంగ్లండ్ గడ్డపై ఆసీస్ జట్టు ఆడిన తొలి టెస్టు ఓవల్లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆడిన 38 టెస్టుల్లో ఇక్కడ ఏడింటిలో మాత్రమే విజయం సాధించింది. ఇంగ్లండ్లోని ఇతర వేదికలతో పోలిస్తే ఓవల్లో ఆసీస్ అత్యల్ప (18.42) విజయాల శాతం సాధించడం గమనార్హం. అంతేకాదు గత 50 ఏళ్లలో కేవలం రెండుసార్లు మాత్రమే గెలిచింది. అందుకే భారత్తో జరిగే ఫైనల్ మ్యాచ్లో నెగ్గి ఓవల్లో తమ పేలవమైన రికార్డును మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం బెకెన్హామ్ మైదానంలో ఆసీస్ ఆటగాళ్లు నెట్స్లో పూర్తి సమయం గడిపారు. మ్యాచ్ జరిగే ఓవల్ గ్రౌండ్లో ప్రస్తుతం ఇరు జట్లకు ప్రాక్టీస్ మరియు ఇతర సౌకర్యాలను ఉపయోగించుకోవడానికి అనుమతి లేదు. మ్యాచ్కు రెండు రోజుల ముందు నుంచి మాత్రమే ఇరు జట్లకు అవకాశం ఉంది.
ఐపీఎల్లోనే ప్రాక్టీస్ చేశాం: అక్షర్
టీ20 ఫార్మాట్ నుంచి టెస్టులకు మారడం సవాలుతో కూడుకున్నదని భారత స్పిన్నర్ అక్షర్ అంగీకరించాడు. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ను దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్లో వారంతా డ్యూక్ బాల్స్తో ప్రాక్టీస్ చేశారని చెప్పాడు. ఇంగ్లండ్లో పరిస్థితులు భారత్లో లేనందున ఇక్కడ ఎలాంటి లైన్ అండ్ లెంగ్త్ అవసరమో తెలుసుకుని ముందుకెళ్తున్నామన్నారు.
స్మిత్, కోహ్లిని కట్టడి చేస్తేనే…: ఫించ్
డిబ్లూటీసీ ఫైనల్లో ఆసీస్ నుంచి స్టీవ్ స్మిత్, భారత్ నుంచి విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషిస్తారని మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ అభిప్రాయపడ్డాడు. ‘ఈ ఇద్దరు నాలుగో నంబర్తో బరిలోకి దిగనున్నారు. ఇరు జట్ల బౌలర్లు వీలైనంత త్వరగా వారిని అవుట్ చేయాలి. ఓవల్లో స్మిత్కు అద్భుతమైన రికార్డు ఉంది. అయితే ఇరు జట్ల మధ్య ఆసక్తికర మ్యాచ్ కావడం ఖాయం’ అని ఫించ్ అన్నాడు. మరోవైపు చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీలపై ఆసీస్ జట్టు దృష్టి సారించాలని మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సూచించాడు. ముఖ్యంగా కౌంటీల్లో ససెక్స్ తరఫున అనూహ్యంగా అద్భుతంగా రాణించాడని, ఐపీఎల్లో రెండు సెంచరీలు, ఆరు అర్ధసెంచరీలతో కోహ్లీ కూడా టచ్లో ఉన్నాడని గుర్తు చేశాడు. వీరిద్దరి కోసం ఆసీస్ చక్కటి ప్రణాళికలతో బరిలోకి దిగాల్సి ఉంటుందని పాంటింగ్ అన్నాడు.
నవీకరించబడిన తేదీ – 2023-06-02T05:05:23+05:30 IST