చివరిగా నవీకరించబడింది:
IND vs WI 1వ టెస్ట్: డొమినికా వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో, కరేబియన్తో జరిగిన మొదటి టెస్ట్లో భారత్ 141 పరుగుల తేడాతో ఇన్నింగ్స్ను గెలుచుకుంది.

IND vs WI 1వ టెస్ట్: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో తొలి రెండు సిరీస్లలో ఓటమి చవిచూసిన భారత్.. మూడో సీజన్ను గ్రాండ్విక్తో ప్రారంభించింది. డొమినికా వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో కరేబియన్తో జరిగిన తొలి టెస్టులో భారత్ 141 పరుగుల ఇన్నింగ్స్తో ఘన విజయం సాధించింది. దీంతో 2 టెస్టుల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్లు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టుపై టీమిండియా స్పిన్ మాస్టర్ రవిచంద్రన్ అశ్విన్ 12 వికెట్లతో విజృంభించాడు. ఈ క్రమంలో అశ్విన్ వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో 7 వికెట్లు తీసి కరీబియన్ల పతనాన్ని శాసించాడు. అలాగే యువ బ్యాట్స్ మెన్ యశస్వి జైస్వాల్ (171) తొలి మ్యాచ్ లోనే సెంచరీతో చెలరేగిపోయాడు. అంతేకాకుండా, రోహిత్ శర్మ (103) సెంచరీతో కెప్టెన్గా తన జట్టును నడిపించాడు. విరాట్ కోహ్లీ (76) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్లో అశ్విన్తో పాటు రవీంద్ర జడేజా కూడా భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
విఫలమైన విండీస్ జట్టు (IND vs WI 1వ టెస్టు)
వెస్టిండీస్ ఆటగాళ్లు ఎవరూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. వెస్టిండీస్లో అలిక్ అతానాజే రెండు ఇన్నింగ్స్లలో 47 మరియు 28 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.
కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 150 పరుగులకే కుప్పకూలింది. అనంతరం క్రీజులోకి వచ్చిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసింది. 271 పరుగుల ఆధిక్యంతో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కాగా 272 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ ఆటగాళ్లు కేవలం 130 పరుగులకే ఆలౌటయ్యారు. అశ్విన్ 7, జడేజా 2 వికెట్లు పడగొట్టడంతో కరీబియన్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. ఫలితంగా తొలి టెస్టులో భారత్ విజయం సాధించింది.