హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి): వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్లో పాల్గొనే భారత మహిళా వాలీబాల్ జట్టుకు తెలంగాణ అమ్మాయి అనన్యశ్రీ ఎంపికైంది. ఈ పోటీలు ఈ నెల 28 నుంచి చైనాలోని చెంగ్డూలో జరగనున్నాయి. నారాయణపేట జిల్లా మక్తల్కు చెందిన అనన్య ప్రస్తుతం కేరళ యూనివర్సిటీలో బీకామ్ చదువుతోంది.