ABN
, First Publish Date – 2023-07-27T02:45:43+05:30 IST
న్డే వరల్డ్ కప్లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ తేదీలో మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ అహ్మదాబాద్లో అక్టోబరు 15న జరగాలి. అయితే, అదేరోజున నవరాత్రి ఉత్సవాలు మొదలవుతాయి.

అక్టోబరు 15 నుంచి 14కు రీషెడ్యూల్
న్యూఢిల్లీ: వన్డే వరల్డ్ కప్లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ తేదీలో మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ అహ్మదాబాద్లో అక్టోబరు 15న జరగాలి. అయితే, అదేరోజున నవరాత్రి ఉత్సవాలు మొదలవుతాయి. గుజరాత్లో అతిపెద్ద ఉత్సవంగా జరుపుకొనే ఈ వేడుకల తొలిరోజు కావడంతో మ్యాచ్కి భద్రత సమస్యలు తలెత్తే అవకాశముంది. ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మ్యాచ్ షెడ్యూల్ను మార్చాల్సిందిగా బీసీసీఐకి భద్రతా ఏజెన్సీలు సూచించినట్టు తెలిసింది. దీంతో ఒకరోజు ముందుగా అంటే.. అక్టోబరు 14వ తేదీకి మ్యాచ్ను రీషెడ్యూల్ చేయాలని బీసీసీఐ ఆలోచిస్తోందని బోర్డు వర్గాలు వెల్లడించాయి. అయితే, మ్యాచ్ తేదీని మారిస్తే అభిమానుల పెద్ద ఇబ్బందే. ఎందుకంటే, ఇప్పటికే ఈ హైవోల్టేజి పోరు కోసం అక్టోబరు 15 నాటికి అహ్మదాబాద్లో వసతి కోసం వేలాది స్థాయిలో అభిమానులు హోటల్ గదులు బుక్ చేసుకున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి మ్యాచ్ను మరో రోజు నిర్వహిస్తే బుకింగ్స్ రద్దు చేసుకోవాల్సి ఉంటుంది.
Updated Date – 2023-07-27T02:45:43+05:30 IST