యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ముస్లిం మత పెద్దలతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అయితే ఈ సమావేశంలో యూసీసీ అంశంపై సీఎం జగన్ నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. ముస్లింలకు నష్టం కలిగితే ఈ బిల్లును వ్యతిరేకిస్తానని జగన్ చెప్పినా యూసీసీపై స్పష్టమైన హామీ ఇవ్వాలని ముస్లిం మత పెద్దలు చేసిన విజ్ఞప్తిపై సీఎం జగన్ స్పందించకపోవడం చర్చనీయాంశమైంది.

అమరావతి: యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ముస్లిం మత పెద్దలతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అయితే ఈ సమావేశంలో యూసీసీ అంశంపై సీఎం జగన్ నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. ముస్లింలకు నష్టం కలిగితే ఈ బిల్లును వ్యతిరేకిస్తానని జగన్ చెప్పినా యూసీసీపై స్పష్టమైన హామీ ఇవ్వాలని ముస్లిం మత పెద్దలు చేసిన విజ్ఞప్తిపై సీఎం జగన్ స్పందించకపోవడం చర్చనీయాంశమైంది.
గురువారం నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో యూసీసీ బిల్లులను ప్రవేశపెడతామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనిపై ఇప్పటికే ముస్లిం పెద్దలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మత పెద్దల అభిప్రాయాలను వ్యక్తిగతంగా తెలుసుకునేందుకు, యూసీసీ వల్ల కలిగే లాభనష్టాలపై చర్చించేందుకు జగన్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత యూసీసీ విషయంలో వైసీపీ వైఖరిని కేంద్రానికి తెలియజేయాలని జగన్ భావించారు. కానీ.. ఆ దిశగా నిర్ణయం తీసుకోవడంలో జగన్ కాస్త వెనక్కు తగ్గినట్లు తాజా భేటీలో స్పష్టమవుతోంది.
ఉమ్మడి పౌర స్మృతిపై స్పష్టమైన మద్దతు ఇవ్వాలని సీఎం జగన్కు కేంద్ర పెద్దలు ఇప్పటికే సూటిగా చెప్పినట్లు సమాచారం. రాజ్యసభలో మీ 9 మంది సభ్యుల మద్దతు మాకు కీలకం.. ఈ బిల్లును ఏపీ అసెంబ్లీలో కూడా ఆమోదించాలని ఇటీవల ఢిల్లీలో తనను కలిసిన జగన్తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్లు ఢిల్లీలోని బీజేపీ వర్గాలు తెలిపాయి. తాడేపల్లిలో జగన్తో భేటీ అయిన సందర్భంగా కేంద్ర మంత్రి కిరణ్రిజిజు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు సమాచారం.ఉమ్మడి పౌర స్మృతిపై కూడా మద్దతు కోరిన సంగతి తెలిసిందే.. నలుగురు మంత్రుల కమిటీకి కిరణ్ రిజిజు నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. UCCలో.
2019కి ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి జగన్ కేంద్రానికి ‘షరతులు లేని’ మద్దతుదారుగా ఉన్నారు.అన్ని బిల్లులకు మద్దతిస్తున్నారు. అలాగే కేంద్రం కూడా జగన్ కు పూర్తి మద్దతు ఇస్తోంది. ‘నువ్వు అడిగినవన్నీ ఇస్తున్నాం. మేం కోరినట్లు యూసీసీకి మద్దతివ్వాల్సిందేనని కేంద్రం నేరుగా జగన్ కు చెప్పిందని ప్రచారం జరుగుతోంది. జగన్ తన అవసరాలు, ఇతర ప్రయోజనాల కోసం మోడీ ప్రభుత్వంతో అంటకాగుతున్నారనేది నిజం. అయితే.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ పెద్దలను కలుస్తున్నట్లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూనే ఉన్నారు. యూసీసీకి మద్దతిస్తే ముస్లిం ఓటర్లు పూర్తిగా దూరమవుతారని జగన్ భయపడుతున్నట్లు తెలుస్తోంది.
నవీకరించబడిన తేదీ – 2023-07-19T22:07:17+05:30 IST