చైనాలోని హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్లోని క్విన్గర్ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. జిమ్ పైకప్పు కూలి 11 మంది చనిపోయారు. ప్రమాద సమయంలో జిమ్లో 19 మంది ఉండగా, 8 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారు.

చైనాలోని హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్లోని క్విన్గర్ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. జిమ్ పైకప్పు కూలి 11 మంది చనిపోయారు. ప్రమాద సమయంలో జిమ్లో 19 మంది ఉండగా, 8 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారు. అలాగే వారంతా జిమ్లో వాలీబాల్లో శిక్షణ పొందుతున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అది ఓ పాఠశాలకు చెందిన జిమ్. అయితే ఆ పాఠశాల ఆవరణలో మరో భవనాన్ని నిర్మిస్తున్నారు. ఆ భవనానికి సంబంధించిన పెర్లైట్ను వ్యాయామశాల పైకప్పుపై అమర్చారు. వాలీబాల్ క్రీడాకారులకు వ్యాయామశాలలో శిక్షణ ఇస్తున్నారు. చైనాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా, పెర్లైట్ తడిగా మరియు బరువు పెరిగింది. దీంతో జిమ్ పైకప్పు బరువు తట్టుకోలేక కూలిపోయిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఆ సమయంలో జిమ్లో 19 మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. అయితే ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మరో 8 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఈ ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. జిమ్ పైకప్పుపై పెర్లైట్ ఏర్పాటుకు ఎలా అనుమతి ఇచ్చారని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ‘‘నా కూతురు చనిపోయిందని చెప్పారు.. కానీ మా బిడ్డ కనిపించలేదు.. ఆస్పత్రికి వెళ్లేసరికి చిన్నారుల ముఖాలంతా బురద, రక్తంతో నిండిపోయాయి.. దయచేసి నా బిడ్డను గుర్తించండి’’ అంటూ ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో పోలీసులు, అధికారులు ప్రవర్తించిన తీరుపై తల్లిదండ్రులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.‘జిమ్పై పెర్లైట్ను అమర్చేందుకు వారికి అనుమతి ఎలా వచ్చింది? ఈ దేశంలో చట్టాన్ని ఉల్లంఘించడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. ప్రజలకు చట్టం అంటే గౌరవం లేదు’’ అని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవలి కాలంలో చైనాలో ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. జూన్లో వాయువ్య చైనాలోని బార్బెక్యూ రెస్టారెంట్లో జరిగిన పేలుడులో 31 మంది మరణించారు. అంతకుముందు, ఏప్రిల్లో బీజింగ్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 29 మంది మరణించారు.
నవీకరించబడిన తేదీ – 2023-07-24T17:55:36+05:30 IST