‘క్యాష్ ఫర్ జాబ్’ కుంభకోణం కేసులో అరెస్టయిన తమిళనాడు మంత్రి వి.సెంథిల్ బాలాజీ జ్యుడీషియల్ కస్టడీని ఆగస్టు 8 వరకు పొడిగించిన చెన్నై సెషన్స్ కోర్టు.. జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించడం ఇది మూడోసారి.

న్యూఢిల్లీ: ‘క్యాష్ ఫర్ జాబ్’ కుంభకోణం కేసులో అరెస్టయిన తమిళనాడు మంత్రి వి.సెంథిల్ బాలాజీ జ్యుడీషియల్ కస్టడీని ఆగస్టు 8 వరకు పొడిగిస్తూ చెన్నై సెషన్స్ కోర్టు.. జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించడం ఇది మూడోసారి. ప్రస్తుతం పుళల్ జైలులో ఉన్న సెంథిల్ బాలాజీ జ్యుడీషియల్ కస్టడీ బుధవారంతో ముగియనుండడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ఎస్.అలీ ఎదుట హాజరుపరిచారు.
అంతకుముందు, సెంథిల్ బాలాజీ అరెస్టును వ్యతిరేకిస్తూ ఆయన భార్య మేఘాల దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ను మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం ముగించింది. బాలాజీ అరెస్టు చట్టవిరుద్ధమని, అతనిపై మోపిన అభియోగాలపై విచారణ పేరుతో ఒక వ్యక్తిని అరెస్టు చేసే అధికారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి లేదని పిటిషనర్ వాదించారు. దీనిపై న్యాయమూర్తులు నిషా భాను, డిబి చక్రవర్తి పరస్పర విరుద్ధమైన తీర్పులు ఇచ్చారు. దీంతో ఈ అంశంపై విచారణ జరిపిన జస్టిస్ సీవీ కార్తికేయన్ ధర్మాసనం తాజాగా కీలక తీర్పు వెలువరించింది. సెంథిల్ అరెస్ట్ చట్టబద్ధమేనని ఈడీ తీర్పునిచ్చింది.
క్యాష్ ఫర్ జాబ్ స్కామ్లో మనీలాండరింగ్ చేసినందుకు సెంథిల్ బాలాజీని జూన్ 14న ఈడీ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అన్నాడీఎంకే హయాంలో ఆయన రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ స్కామ్కు పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. ఈడీ అరెస్ట్తో విద్యుత్, ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి పదవులు కోల్పోయారు. ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వంలో శాఖ లేకుండానే మంత్రిగా కొనసాగుతున్నారు.
నవీకరించబడిన తేదీ – 2023-07-26T16:53:12+05:30 IST