న్యూఢిల్లీ : హర్యానాలోని నుహ్ జిల్లాలో జలాభిషేక యాత్రపై దాడి తర్వాత చెలరేగిన హింసాత్మక ఘర్షణలపై అమెరికా స్పందించింది. అన్ని పార్టీలు సంయమనం పాటించాలని, హింసాత్మక చర్యలకు పాల్పడకుండా ఉండాలని కోరింది. నుహ్, గురుగ్రామ్ తదితర ప్రాంతాల్లో సోమవారం నుంచి మత ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నుహ్ జిల్లాలో కర్ఫ్యూ విధించారు. ఈ నెల 5వ తేదీ వరకు ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు.
స్థానిక కాలమానం ప్రకారం బుధవారం హర్యానా ఘర్షణలపై మీడియా అడిగిన ప్రశ్నలకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందించారు. అన్ని పార్టీలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. హింసాత్మక చర్యలకు పాల్పడరాదని అన్నారు. గురుగ్రామ్లో జరిగిన ఘర్షణల్లో అమెరికన్లు బాధితులేనా? లేదా? ఇంకా తెలియదన్నారు. దీనిపై ఎంబసీ అధికారులతో మాట్లాడతానని చెప్పారు.
విశ్వహిందూ పరిషత్ తదితర సంస్థలు సోమవారం నిర్వహించిన జలాభిషేక యాత్రపై దుండగులు దాడి చేశారు. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు హోంగార్డులు ఉన్నారు. పోలీస్ స్టేషన్, పోలీసులపై దుండగులు దాడి చేశారు. దాదాపు 20 మంది పోలీసులు గాయపడ్డారు.
ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం
నుహ్, ఫరీదాబాద్, పాల్వాల్ జిల్లాలు మరియు గురుగ్రామ్లోని మూడు సబ్ డివిజన్లలో, ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఈ నెల 5 వరకు ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు హర్యానా హోంశాఖ కార్యదర్శి ప్రకటించారు. సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారం, వదంతులు వ్యాపించకూడదనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
న్యూఢిల్లీ: హర్యానాలోని నుహ్ జిల్లాలో జలాభిషేక యాత్రపై దాడి అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణలపై అమెరికా స్పందించింది. అన్ని పార్టీలు సంయమనం పాటించాలని, హింసాత్మక చర్యలకు పాల్పడకుండా ఉండాలని కోరింది. నుహ్, గురుగ్రామ్ తదితర ప్రాంతాల్లో సోమవారం నుంచి మత ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నుహ్ జిల్లాలో కర్ఫ్యూ విధించారు. ఈ నెల 5వ తేదీ వరకు ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు.
స్థానిక కాలమానం ప్రకారం బుధవారం హర్యానా ఘర్షణలపై మీడియా అడిగిన ప్రశ్నలకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందించారు. అన్ని పార్టీలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. హింసాత్మక చర్యలకు పాల్పడరాదని అన్నారు. గురుగ్రామ్లో జరిగిన ఘర్షణల్లో అమెరికన్లు బాధితులేనా? లేదా? ఇంకా తెలియదన్నారు. దీనిపై ఎంబసీ అధికారులతో మాట్లాడతానని చెప్పారు.
విశ్వహిందూ పరిషత్ తదితర సంస్థలు సోమవారం నిర్వహించిన జలాభిషేక యాత్రపై దుండగులు దాడి చేశారు. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు హోంగార్డులు ఉన్నారు. పోలీస్ స్టేషన్, పోలీసులపై దుండగులు దాడి చేశారు. దాదాపు 20 మంది పోలీసులు గాయపడ్డారు.
ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం
నుహ్, ఫరీదాబాద్, పాల్వాల్ జిల్లాలు మరియు గురుగ్రామ్లోని మూడు సబ్ డివిజన్లలో, ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఈ నెల 5 వరకు ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు హర్యానా హోంశాఖ కార్యదర్శి ప్రకటించారు. సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారం, వదంతులు వ్యాపించకూడదనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
న్యాయమూర్తి, ఆమె మూడేళ్ల కూతురు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు
నుహ్లో జరిగిన క్రూరమైన దాడిలో అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అంజలి జైన్ ప్రయాణిస్తున్న కారుపై దుండగులు దాడి చేసి తగులబెట్టారు. ఆమె తన మూడేళ్ల కుమార్తె మరియు సిబ్బందితో కలిసి ఈ కారులో ప్రయాణిస్తోంది. ఇద్దరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. దుండగులు రాళ్లు రువ్వి వారిపై కాల్పులు జరిపారు. వాళ్లంతా ఓ వర్క్షాప్లో తలదాచుకుంటున్నారు. కొంతసేపటికి కొందరు లాయర్లు అటుగా వచ్చి వారిని కాపాడారు. మంగళవారం నుహ్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్)లో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
నుహ్లో జరిగిన క్రూరమైన దాడిలో అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అంజలి జైన్ ప్రయాణిస్తున్న కారుపై దుండగులు దాడి చేసి తగులబెట్టారు. ఆమె తన మూడేళ్ల కుమార్తె మరియు సిబ్బందితో కలిసి ఈ కారులో ప్రయాణిస్తోంది. ఇద్దరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. దుండగులు రాళ్లు రువ్వి వారిపై కాల్పులు జరిపారు. వాళ్లంతా ఓ వర్క్షాప్లో తలదాచుకుంటున్నారు. కొంతసేపటికి కొందరు లాయర్లు అటుగా వచ్చి వారిని కాపాడారు. మంగళవారం నుహ్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్)లో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
ఇది కూడా చదవండి:
సీఎం మనోహర్లాల్ ఖట్టర్: ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తే పరిహారం ఇవ్వలేం
చెన్నై: 6 నుంచి ఆర్థిక సాయం దరఖాస్తుల పరిశీలన
నవీకరించబడిన తేదీ – 2023-08-03T09:50:41+05:30 IST