మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ కార్యక్రమాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. మరో ఏడాదిలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో..

చంద్రబాబు, బాలకృష్ణ
చంద్రబాబు బాలకృష్ణ: నందమూరి కుటుంబంలో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసి కుమారుడు వెంకట శ్రీహర్ష వివాహం సాయి గీతికతో ఆదివారం రాత్రి హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి తదితర రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే సినీ ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మేనల్లుడు పెళ్లి చేసుకోవడంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పెళ్లి పనులు కూడా దగ్గరుండి చూసుకున్నారు.

చంద్రబాబు నాయుడు
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ కార్యక్రమాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. వచ్చే ఏడాది ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చంద్రబాబుతో పాటు బాలకృష్ణ పార్టీ కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు. అయితే కుటుంబ సభ్యురాలు నందమూరి సుహాని కుమారుడి పెళ్లి జరగడంతో పెళ్లికి హాజరై దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వివాహానికి హాజరైన ప్రముఖులతో బాలకృష్ణ, చంద్రబాబు సరదాగా మాట్లాడుతూ కనిపించారు. వివాహ వేడుకలో చంద్రబాబు నాయుడు బంధువులు, ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగించారు. పెళ్లి వేడుకలో బాలయ్య, చంద్రబాబు సరదాగా మాట్లాడుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ
నందమూరి సుహాసిని గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి తెలంగాణ టీడీపీలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు. అయితే మరికొద్ది రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఆమె మరోసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ