రామోజీరావు పద్మవిభూషణ్. భారతరత్న తర్వాత దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్న రామోజీరావు ఇప్పటికే పలు వ్యాపార సంస్థలను ప్రారంభించారు. లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. కొన్ని లక్షల మందికి ఆయన స్ఫూర్తిగా నిలిచారు. ఇది ఒక్కరోజులో.. రెండు రోజుల్లో వచ్చిన కీర్తి కాదు. ఆయన కష్టపడి దీన్ని నిర్మించారు. అలాంటి మేరునగధీరుడు ఇప్పుడు ప్రజాధనాన్ని దోచుకుంటున్నాడంటూ తీవ్ర ఆరోపణలతో ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడ్డారంటూ నాయ కుల చేత చీవాట్లు తిన్న నాయకుడు దాడికి దిగుతున్నారు. వచ్చిన పదవిని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. కోర్టుల ఆదేశాలను సైతం లెక్కచేయడం లేదు.
మరి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పొందిన వారిని రక్షించలేని వ్యవస్థలు ఈ దేశంలో ఉన్నాయా? తప్పుడు ప్రచారాలు, తప్పుడు కేసులతో నమ్మకంతో నిర్మించిన సంస్థను కూల్చివేసి కొన్ని వేల మందిని రోడ్డున పడేయాలన్నారు. దీనంతటికీ కారణం ఈనాడు పత్రికల ద్వారా ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యయుతంగా నిలదీయడమే. ఈనాడు దినపత్రిక జగన్ రెడ్డి పరిపాలనను ప్రజల ముందుంచడం వల్ల దుష్పరిణామాలు వెల్లువెత్తుతున్నాయి. మీడియాపై దాడి కూడా అవుతుంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వం ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడటం.. వ్యాపార సంస్థలపై దాడులు.. సొంత మీడియాలో వ్యక్తిత్వంపై దాడులు.. వ్యవస్థలన్నీ నిర్వీర్యం కావడం.. కచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే.
దేశంలో ఏం జరుగుతోందో కేంద్రానికి తెలియదా..రాష్ట్రంలో ప్రజల చేత అధికారం పొందిన ప్రభుత్వం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుంటే.. ఎవరైనా పట్టించుకుంటారా? ఇసుక, మద్యం కుంభకోణాలు ఇలా మాట్లాడుతుంటే- ఏపీలో అసలు రాజ్యాంగం అమలవుతోందా? కేంద్రం ఏం చేస్తోంది? .
పద్మవిభూషణ్పై అధికార దాడి ఖచ్చితంగా దేశ గౌరవాన్ని అవమానించడమే. దీన్ని అడ్డుకోలేని కేంద్ర అసమర్థత అయితే రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి, వ్యవస్థలను అమలు చేయలేక పోయిందని ప్రజల ముందు ఒప్పుకోవడం ఉత్తమం.