ఆసియా కప్-2023 టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్లో పాకిస్థాన్ జట్టుతో టీమ్ ఇండియా ఆడనుంది. సెప్టెంబర్ 2న శ్రీలంకలోని క్యాండీలో మ్యాచ్ జరగనుంది.

భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్
ఆసియా కప్ 2023లో IND vs PAK మ్యాచ్: ICC ODI ప్రపంచ కప్ ఈ సంవత్సరం అక్టోబర్-నవంబర్లో భారతదేశంలో జరుగుతుంది. ఈ మెగా టోర్నీకి ముందు ఆసియా కప్-2023 టోర్నీ జరగనుంది. ఈ టోర్నీ బుధవారం పాకిస్థాన్లో ప్రారంభమైంది. ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్లో పాకిస్థాన్ వర్సెస్ నేపాల్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ బాబర్, ఇఫ్తికార్ సెంచరీలతో 342 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన యువ నేపాల్ జట్టు కేవలం 23.4 ఓవర్లలో 104 పరుగులకు ఆలౌటైంది. పాకిస్థాన్ 238 పరుగుల తేడాతో విజయం సాధించింది. గురువారం సాయంత్రం శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
ఇక టీమిండియా విషయానికొస్తే.. తొలి మ్యాచ్లో పాకిస్థాన్ జట్టుతో తలపడనుంది. సెప్టెంబరు 2న శ్రీలంకలోని క్యాండీలో పాకిస్థాన్, భారత్ మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్ జరిగే అవకాశాలు తక్కువ. సుదీర్ఘ విరామం తర్వాత దాయాది జట్లు మ్యాచ్ కు సిద్ధమవుతుండగా.. క్రికెట్ అభిమానులు సైతం భారత్-పాక్ మధ్య మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాలుగేళ్ల తర్వాత ఇరు జట్లు తలపడుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య జరిగే మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే, వారు నిరాశ చెందే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 2న భారత్-పాకిస్థాన్ మధ్య జరగనున్న మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే.. శనివారం క్యాండీలో వర్షం ముప్పు పొంచి ఉంది. ఆ రోజు 90 శాతం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో తేమ 84 శాతం ఉందని ఆమె తెలిపారు. ఫలితంగా 2023 ఆసియా కప్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటే.. పాకిస్థాన్-భారత్ మధ్య మ్యాచ్ వరుణుడి ఖాతాలో వేసే అవకాశం లేకపోలేదు.