ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైభవ్ జువెలర్స్ పేరుతో ఆభరణాల విక్రయ కేంద్రాలను నిర్వహిస్తున్న మనోజ్ వైభవ్ జెమ్స్ ‘ఎన్’ జ్యూయలర్స్ లిమిటెడ్.. ఈ నెల 22న ప్రారంభమైన పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) 26న ముగియనుంది. ….

ఇష్యూ ధర పరిధి రూ.204-215
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైభవ్ జువెలర్స్ పేరుతో ఆభరణాల విక్రయ కేంద్రాలను నిర్వహిస్తున్న మనోజ్ వైభవ్ జెమ్స్ ‘ఎన్’ జ్యూయలర్స్ లిమిటెడ్.. ఈ నెల 22న ప్రారంభమైన పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) 26న ముగియనుంది. ఇష్యూలో భాగంగా విక్రయించే షేర్ల ధరల శ్రేణిని రూ.204-215గా నిర్ణయించినట్లు కంపెనీ సీఎండీ భరత మల్లికా రత్నకుమారి గ్రాంధి, సీఎఫ్వో గ్రాంధి సాయి కీర్తన, సీఓఓ గొంట్ల రఖాల్ తెలిపారు. ఈ ఇష్యూ ద్వారా రూ.270 కోట్ల వరకు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఓలో భాగంగా రూ.210 కోట్ల విలువైన తాజా ఈక్విటీ ఇష్యూతో పాటు ఆఫర్ ఫర్ సేల్ రూపంలో 28 లక్షల ఈక్విటీ షేర్లను కంపెనీ విక్రయించనుంది. బజాజ్ క్యాపిటల్ మరియు ఎలారా క్యాపిటల్ ఈ ఇష్యూకి బుక్ రన్నింగ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.
8 కొత్త షోరూమ్ల ప్రారంభం: పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించిన నిధులను 8 కొత్త షోరూమ్లను తెరవడానికి మరియు ఇన్వెంటరీ మరియు ఇతర వ్యాపార కార్యకలాపాలకు ఉపయోగించనున్నట్లు వైభవ్ జ్యువెలర్స్ వెల్లడించారు. ప్రస్తుతం వైభవ్ జ్యువెలర్స్ హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, శ్రీకాకుళం సహా పలు పట్టణాల్లో మొత్తం 14 షోరూమ్లను నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో (2022-23) ఏపీ, తెలంగాణ జ్యువెలరీ మార్కెట్లో తమకు 4 శాతం మార్కెట్ వాటా ఉందని కంపెనీ తెలిపింది. 2022-23లో బంగారు ఆభరణాల విక్రయం ద్వారా కంపెనీ రూ.2,027.34 కోట్ల ఆదాయాన్ని పొందింది. జూన్తో ముగిసిన త్రైమాసికంలో రెవె న్యూ రూ.508.90 కోట్లుగా నమోదైంది.
నవీకరించబడిన తేదీ – 2023-09-16T02:18:03+05:30 IST