చాలా గ్యాప్ తర్వాత డ్యాన్స్ బ్యూటీ సాయి పల్లవి ఓ సినిమాకి సైన్ చేసింది. ఈ సినిమా వివరాలను యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కథానాయిక సాయి పల్లవి కూడా ఈ సినిమా విశేషాలను ట్విట్టర్లో షేర్ చేస్తూ మళ్లీ తెలుగులో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు ఆనందంగా ఉంది. ప్రస్తుతం సాయి పల్లవి చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇక విషయానికి వస్తే..
యువ సామ్రాట్ నాగ చైతన్య, దర్శకుడు చందూ మొండేటి పాన్ ఇండియా చిత్రం #NC23 ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నెల రోజుల క్రితమే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసిన చిత్రబృందం.. త్వరలోనే షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రాన్ని బన్నీ వాస్ నిర్మిస్తుండగా, తెలుగుతో పాటు హిందీలో కూడా ఎన్నో హిట్ చిత్రాలను అందించిన నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్పై నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. #NC23 అనే టైటిల్ తో ఈ చిత్రం నాగ చైతన్య మరియు చందూ మొండేటి ఇద్దరికీ అత్యంత భారీ బడ్జెట్ చిత్రం కానుంది. హైప్రొడక్షన్, టెక్నికల్ స్టాండర్డ్స్తో గ్రాండ్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులకే నిర్మాతలు భారీ బడ్జెట్ను వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రీ-ప్రొడక్షన్ పనులలో భాగంగా ఈ చిత్ర హీరోయిన్ కూడా టీమ్తో జాయిన్ అయింది. అయితే ఈరోజు (బుధవారం) ఆమె ఎవరో నిర్మాతలు వెల్లడించారు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో చాలా అందమైన మరియు ప్రతిభావంతులైన హీరోయిన్ సాయి పల్లవి (సాయి పల్లవి) హీరోయిన్గా చేరింది. గతంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘లవ్ స్టోరీ’లో నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి పనిచేశారు. రాబోయే సినిమాలో కూడా వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.
==============================
****************************************
*******************************************
*******************************************
నవీకరించబడిన తేదీ – 2023-09-20T17:49:26+05:30 IST