భారత్లో ఐఫోన్లను తయారు చేసేందుకు టాటా గ్రూప్ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం టాటా ఎలక్ట్రానిక్స్ బెంగళూరు సమీపంలోని తైవాన్కు చెందిన విస్ట్రాన్ ప్లాంట్ను 12.5 కోట్ల డాలర్లకు (దాదాపు రూ. 1,037 కోట్లు) కొనుగోలు చేసింది…

భారత్లో విస్ట్రాన్ ప్లాంట్ కొనుగోలు..రూ.1,037 కోట్ల డీల్
న్యూఢిల్లీ: భారత్లో ఐఫోన్లను తయారు చేసేందుకు టాటా గ్రూప్ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం టాటా ఎలక్ట్రానిక్స్ బెంగళూరు సమీపంలోని తైవాన్కు చెందిన విస్ట్రాన్ ప్లాంట్ను 12.5 కోట్ల డాలర్లకు (దాదాపు రూ. 1,037 కోట్లు) కొనుగోలు చేసింది. విస్ట్రాన్ ఇన్ఫోకామ్ డైరెక్టర్ల బోర్డు శుక్రవారం ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. దాదాపు 10,000 మంది ఉద్యోగులతో ఉన్న ఈ ప్లాంట్లో విస్ట్రాన్ సరికొత్త ‘ఐఫోన్ 14’ మోడల్లను అసెంబ్లింగ్ చేస్తోంది. ఈ డీల్తో టాటా గ్రూప్ ఐఫోన్లను తయారు చేస్తున్న తొలి భారతీయ కంపెనీగా అవతరిస్తుంది. ఇప్పటి వరకు, ఫాక్స్కాన్, విస్ట్రాన్ మరియు పెగాట్రాన్ కార్పొరేషన్ వంటి తైవాన్ కంపెనీలు కాంట్రాక్ట్ ప్రకారం భారతదేశంలోని తమ ఫ్యాక్టరీలలో ఐఫోన్లను తయారు చేసి ఆపిల్కు సరఫరా చేస్తున్నాయి.
భారీ అవకాశం: యాపిల్ ఐఫోన్ ఉత్పత్తిలో ప్రస్తుతం చైనా 90 శాతం వాటాను కలిగి ఉంది. యుఎస్-చైనా వాణిజ్య యుద్ధం మరియు కేవలం చైనాపై ఆధారపడకుండా ఆపిల్ యొక్క వ్యూహం భారతదేశంలో ఐఫోన్ల భారీ ఉత్పత్తికి మార్గం సుగమం చేస్తోంది. ప్రస్తుతం ఐఫోన్ల తయారీలో భారత్ వాటా ఏడు శాతం మాత్రమే. వచ్చే 4-5 ఏళ్లలో దీన్ని 25 శాతానికి పెంచాలని యాపిల్ భావిస్తోంది. వీటికి తోడు ప్రభుత్వం ప్రకటించిన పీఎల్ఐ పథకం కీలక ఎలక్ట్రానిక్ ఉపకరణాలను తయారు చేసే కంపెనీలను కూడా ఆకర్షిస్తోంది. దీంతో ఐఫోన్ల తయారీకి టాటా గ్రూప్ సిద్ధమైంది. విస్ట్రాన్ కొనుగోలుకు సంబంధించి అన్ని అనుమతులు లభిస్తే రెండున్నరేళ్లలో ఐఫోన్లు, ఇతర యాపిల్ కంపెనీ గ్యాడ్జెట్లను తయారు చేయవచ్చని టాటా గ్రూప్ అంచనా వేస్తోంది.
నవీకరించబడిన తేదీ – 2023-10-28T05:25:42+05:30 IST