గవర్నర్: మళ్లీ ఢిల్లీ వెళ్లిన గవర్నర్

గవర్నర్: మళ్లీ ఢిల్లీ వెళ్లిన గవర్నర్

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-11-26T07:19:33+05:30 IST

గవర్నర్ ఆర్ ఎన్ రవి శనివారం ఆకస్మికంగా ఢిల్లీ వెళ్లారు. ఈ వారం అతను

గవర్నర్: మళ్లీ ఢిల్లీ వెళ్లిన గవర్నర్

– సుప్రీంకోర్టు నుంచి ప్రతికూల సంకేతాలతో డైలమా

– నేడు అమిత్‌షాతో భేటీ

చెన్నై, (ఆంధ్రజ్యోతి): గవర్నర్ ఆర్ ఎన్ రవి శనివారం ఆకస్మికంగా ఢిల్లీ వెళ్లారు. ఈ వారంలో ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి. ఈ నెల 19న ఢిల్లీ వెళ్లిన ఆయన సోమవారం మధ్యాహ్నం తిరిగి చెన్నై చేరుకున్నారు. గవర్నర్‌పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతకుముందు పంజాబ్, కేరళ గవర్నర్లపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. వారి తీరును ఖండించింది. రాష్ట్ర న్యాయశాఖ మంత్రి రఘుపతి కూడా అదే రీతిలో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి వ్యతిరేకంగా తీర్పు వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. పంజాబ్ గవర్నర్‌పై ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ సుప్రీంకోర్టులో తమ వాదనలు వినిపిస్తామని పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా, పది యూనివర్సిటీలకు సంబంధించిన ముఖ్యమైన బిల్లులను గవర్నర్ రవి తిప్పి కొట్టడం, ఆ బిల్లులకు ముఖ్యమంత్రి స్టాలిన్ రెండోసారి శాసనసభ ఆమోదం తెలపడంతో.. పంజాబ్ గవర్నర్ కు మరో గత్యంతరం లేదని సుప్రీంకోర్టు తాజాగా తేల్చిచెప్పింది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఆమోదించిన బిల్లులను పరిశీలించి ఆమోదించాలి. ఈ పరిస్థితుల్లో గవర్నర్ రవి రెండోసారి ఒకరోజు పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లారు. శనివారం సాయంత్రం 5.15 గంటలకు ఢిల్లీకి బయలుదేరారు. గవర్నర్‌తో పాటు ఆయన ప్రత్యేక కార్యదర్శి, భద్రతా విభాగం అధికారి కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రిని కలుస్తున్నట్లు తెలిసింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, పెండింగ్ బిల్లుల విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయం తదితర అంశాలపై కేంద్ర హోంమంత్రితో గవర్నర్ చర్చిస్తారని.. ఢిల్లీ నుంచి బయలుదేరి ఆదివారం రాత్రి 8.30 గంటలకు చెన్నై చేరుకుంటారని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.

నవీకరించబడిన తేదీ – 2023-11-26T07:19:35+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *