భారతదేశంలో ఉక్కు డిమాండ్ వార్షికంగా 7 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. నిర్మాణం మరియు మౌలిక సదుపాయాల రంగాల మద్దతుతో, 2030 నాటికి దేశంలో వార్షిక డిమాండ్ 19 కోట్ల టన్నులకు చేరుకోవచ్చని స్టీల్మింట్ ఇటీవలి నివేదికలో పేర్కొంది.

స్టీల్మింట్ ద్వారా అంచనా వేయబడింది
న్యూఢిల్లీ: భారతదేశంలో ఉక్కు డిమాండ్ వార్షికంగా 7 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. నిర్మాణం మరియు మౌలిక సదుపాయాల రంగాల మద్దతుతో, 2030 నాటికి దేశంలో వార్షిక డిమాండ్ 19 కోట్ల టన్నులకు చేరుకోవచ్చని స్టీల్మింట్ ఇటీవలి నివేదికలో పేర్కొంది. మొత్తం డిమాండ్లో 60-65 శాతం ఈ రెండు రంగాల నుంచేనని పేర్కొంది. అంచనాలకు మించి డిమాండ్ పెరిగి 23 కోట్ల టన్నులకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని పేర్కొంది. ఆటో, ఇంజినీరింగ్ రంగాలు కూడా స్టీల్ డిమాండ్కు మద్దతు ఇస్తాయని నివేదిక అంచనా వేసింది. ఈ ఏడాది చివరి నాటికి వార్షిక ఉక్కు ఉత్పత్తి 13.6 కోట్ల టన్నులకు చేరుకుంటుందని, డిమాండ్ 12 కోట్ల టన్నులకు చేరుతుందని అంచనా. 2030 నాటికి ముడి ఉక్కు ఉత్పత్తి 21 కోట్ల టన్నులకు చేరుతుందని అంచనా.
సాధారణ బీమా (నాన్-లైఫ్) మార్కెట్లో ప్రైవేట్ కంపెనీల వాటా మరింత పెరిగింది. సెప్టెంబరుతో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరు నెలల్లో ప్రైవేట్ రంగంలోని 31 సాధారణ బీమా కంపెనీల అండర్రైట్ చేసిన స్థూల ప్రత్యక్ష ప్రీమియం (జిడిపి) 14.86 శాతం పెరిగి రూ.1,25,194 కోట్ల నుంచి రూ.1.43 లక్షల కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో ప్రైవేట్ బీమా కంపెనీల మార్కెట్ వాటా 50.81 శాతం నుంచి 53.58 శాతానికి పెరిగింది.
IEEE R10 పవర్ అండ్ ఎనర్జీ సొసైటీ (PEC) ఇండియా చాప్టర్స్ హైదరాబాద్లో 4వ వార్షిక గ్లోబల్ వర్క్షాప్ను నిర్వహించింది. ఈ నెల 25-26 తేదీల్లో జరిగిన ఈ వర్క్షాప్లో విద్యుత్, ఇంధన వ్యవస్థల్లో స్మార్ట్ టెక్నాలజీల వినియోగంపై విస్తృతంగా చర్చించారు. అలాగే, IEEE యంగ్ ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేకంగా 12 ప్లీనరీ సెషన్లు నిర్వహించబడ్డాయి.
నవీకరించబడిన తేదీ – 2023-11-27T03:07:36+05:30 IST