మహువా మొయిత్రా: మహువా మొయిత్రా ఎవరు? ఆమె నేపథ్యం ఏమిటి?

మహువా మొయిత్రా: మహువా మొయిత్రా ఎవరు?  ఆమె నేపథ్యం ఏమిటి?

లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురైన మహువా మొయిత్రా ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. మహువా అసలు నేపథ్యం ఏమిటి?

మహువా మొయిత్రా: మహువా మొయిత్రా ఎవరు?  ఆమె నేపథ్యం ఏమిటి?

మహువా మోయిత్రా

మహువా మొయిత్రా: డబ్బు తీసుకుని పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహువా మొయిత్రా ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. మహువా మోయిత్రా ఎవరు? నేపథ్యం ఏమిటి?

మమతా బెనర్జీ: ఎంపీ మోహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించడం బీజేపీ ప్రతీకార రాజకీయం: మమతా బెనర్జీ

టిఎంసి ఎంపి మహువా మొయిత్రా డబ్బు తీసుకుని పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగారని ఆరోపణలు వచ్చాయి. ఎథిక్స్ కమిటీ నివేదికను లోక్‌సభ ఆమోదించిన తర్వాత, మహువా మోయిత్రా సభ్యత్వం రద్దు చేయబడింది. ఈ ఆరోపణలపై ఆమె సభలో వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా అనుమతించలేదు. మరోవైపు ఆమె సభ్యత్వం రద్దుపై విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ గందరగోళం మధ్య సభ డిసెంబర్ 11కి వాయిదా పడింది.ఈ నేపథ్యంలో మహువా మొయిత్రా వార్తల్లో నిలిచారు. ఎవరు నేపథ్యం ఏమిటి?

మహువా మొయిత్రా 12 అక్టోబర్ 1974న అస్సాంలోని కాచర్ జిల్లాలోని లబాక్‌లో జన్మించారు. 1998లో, ఆమె యునైటెడ్ స్టేట్స్‌లోని మసాచుసెట్స్‌లోని మౌంట్ హోలియోక్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించింది. మ్యాథ్స్ అండ్ ఎకనామిక్స్ చదివారు. అమెరికా బహుళజాతి పెట్టుబడి బ్యాంకు అయిన JP మోర్గాన్‌లో బ్యాంకర్‌గా పనిచేశారు. మహువా 2009లో లండన్‌లోని ఉద్యోగాన్ని వదిలి భారత రాజకీయాల్లోకి ప్రవేశించారు.

మహువా మొయిత్రా: TMC ఎంపీ మొహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వం రద్దు చేయబడింది
2009లో కాంగ్రెస్ పార్టీలో చేరిన మహువా 2010లో మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు.2016 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి కరీంపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కృష్ణానగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి కల్యాణ్ చౌబేపై ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2019లో లోక్‌సభలో ఎన్‌డీఏపై విమర్శలు చేస్తూ ప్రసంగం చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. టీఎంసీ జాతీయ అధికార ప్రతినిధిగా చాలా ఏళ్లు పనిచేశారు. మహువా ఎక్కువగా టీవీ చర్చల్లో కనిపిస్తారు. 2019లో, ఒక టీవీ టాక్ షోలో తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆ ఛానెల్ చీఫ్ న్యూస్ ఛానెల్‌పై పరువు నష్టం దావా వేశారు. ఇదిలా ఉండగా, డబ్బు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారనే ఆరోపణలతో బహిష్కరణకు గురైన మహువా వార్తల్లో నిలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *