‘ఎక్స్’లో గౌతమ్ అదానీ
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా వచ్చే పదేళ్లలో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ సోషల్ మీడియా వెబ్సైట్ ‘ఎక్స్’ ద్వారా కొన్ని విషయాలను వెల్లడించారు. ఈ పెట్టుబడుల ద్వారా మౌలిక సదుపాయాల రంగంలో తమ స్థానాన్ని పటిష్టం చేసుకుంటామని చెప్పారు. అదానీ గ్రూప్ మాతృ సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్ ఇప్పటికే గనులు, విమానాశ్రయాలు, రక్షణ, ఏరోస్పేస్, సోలార్ పవర్, రోడ్లు, మెట్రో, డేటా సెంటర్లు మరియు రిసోర్స్ మేనేజ్మెంట్ వంటి కొత్త రంగాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది.
1,000 MW ప్లాంట్: 2040 నాటికి అదానీ పోర్ట్స్ కాలుష్య కారక ఇంధనాల వాడకాన్ని పూర్తిగా నిలిపివేస్తామని గౌతమ్ అదానీ ప్రకటించారు.అదానీ పోర్ట్స్ అవసరాల కోసం పూర్తిగా 1,000 మెగావాట్ల సామర్థ్యంతో పునరుత్పాదక ఇంధన కర్మాగారాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం 2025 మార్చి నాటికి తీర ప్రాంతాల్లో 5,000 హెక్టార్లలో మడ అడవులను పెంచుతామని అదానీ వెల్లడించారు. దీనికి తోడు గుజరాత్లోని కచ్ ఎడారి ప్రాంతంలో 30,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన వనరుల పార్కును ఏర్పాటు చేయబోతున్నట్లు అదానీ ప్రకటించింది. పునరుత్పాదక ఇంధన వనరుల కోసం ఇంత పెద్ద పార్కును ప్రపంచంలో మరెక్కడా ఏర్పాటు చేయలేదు.
EV ఛార్జింగ్ స్టేషన్లు:
ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ప్రవేశిస్తున్నామని గౌతం అదానీ తెలిపారు. ఇందుకోసం అదానీ టోటల్ గ్యాస్ కంపెనీ 2030 నాటికి దేశవ్యాప్తంగా 75,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది.దీనికి తోడు ఇదే కంపెనీ వ్యవసాయ వ్యర్థాలను బయోగ్యాస్గా మార్చే ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.
నవీకరించబడిన తేదీ – 2023-12-11T04:26:25+05:30 IST