ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు ఈరోజు కీలక తీర్పు వెలువరించింది. రాజ్యాంగ ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.

ఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు ఈరోజు కీలక తీర్పు వెలువరించింది. రాజ్యాంగ ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. అయితే ఐదుగురు న్యాయమూర్తులు మూడు వేర్వేరు తీర్పులు ఇచ్చారు. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని సీజేఐ వివరించారు. ఆర్టికల్ 370 రద్దుపై పార్లమెంటు నిర్ణయాన్ని తిరస్కరించలేము. భారత్లో చేరినప్పుడు జమ్మూ కాశ్మీర్కు సార్వభౌమాధికారం లేదని సీజేఐ అన్నారు. కేంద్రం తీసుకునే ప్రతి చర్యను సవాలు చేయకూడదు.
తీర్పు నేపథ్యంలో కాశ్మీర్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. తీర్పును రాజకీయం చేయవద్దని బీజేపీ కోరింది. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగదని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ జమ్మూ కాశ్మీర్ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. గుప్కార్ అలయన్స్ పేరుతో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఆగస్ట్ 5, 2019న, ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జమ్మూ కాశ్మీర్లోని పలు రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
నవీకరించబడిన తేదీ – 2023-12-11T11:14:50+05:30 IST