చక్కెర ధర మళ్లీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 2024 సెప్టెంబర్లో ముగిసే 2023-24 చక్కెర సీజన్లో కీలకమైన చక్కెర ఉత్పత్తి రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలలో వర్షాభావ పరిస్థితుల కారణంగా…

తిరిగి దిగుమతులకు అవకాశం
న్యూఢిల్లీ: పంచదార ధర మళ్లీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. చక్కెర ఉత్పత్తి చేసే కీలక రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకల్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా 2024 సెప్టెంబర్తో ముగిసే 2023-24 చక్కెర సీజన్లో దేశంలో చక్కెర ఉత్పత్తి 3.31 కోట్ల టన్నుల నుంచి 3.17 కోట్ల టన్నులకు తగ్గుతుందని అంచనా. 2.9 కోట్ల టన్నుల నుంచి 3 కోట్ల టన్నులకు మించి ఉత్పత్తి ఉండకపోవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2024-25 చక్కెర సీజన్లో ఇది 2.50-2.69 కోట్ల టన్నులకు మరింత తగ్గుతుందని అంచనా. అదే జరిగితే భారత్ మళ్లీ చక్కెర దిగుమతుల వైపు వెళ్లక తప్పదని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ధర నియంత్రణలు: ఈ అంచనాలతో దేశీయ మార్కెట్లో చక్కెర ధరలు ఇప్పటికే పైకి ఎగబాకుతున్నాయి. రెండు మూడు నెలల క్రితం రిటైల్ మార్కెట్ లో కిలో చక్కెర ధర రూ.40 నుంచి రూ.42 ఉండగా, ప్రస్తుతం కిలో రూ.44 నుంచి రూ.46కి చేరింది. భవిష్యత్తులో మరింత పెరిగే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారత్లో చక్కెర ఉత్పత్తి తగ్గుతుందన్న వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో టన్ను చక్కెర ధర ఇప్పటికే 610 డాలర్లకు (దాదాపు రూ.50,650) చేరింది. భారతదేశం దిగుమతి చేసుకోవడం ప్రారంభిస్తే ఈ ప్రమాదం మరింత పెరుగుతుందని అంచనా.
మరోవైపు రానున్న ముప్పును ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. త్వరలో చక్కెర ఎగుమతులపై కూడా నిషేధం విధించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇథనాల్ ఉత్పత్తికి మళ్లించిన చెరకు 17 లక్షల టన్నులకు మించకూడదని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి తోడు వ్యాపారుల వద్ద ఉన్న చక్కెర నిల్వలపై కూడా త్వరలో ఆంక్షలు విధించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
నవీకరించబడిన తేదీ – డిసెంబర్ 24, 2023 | 03:41 AM