కరువు కోసం రైతులు ఎదురుచూస్తున్నారని కర్ణాటక వ్యవసాయ మార్కెటింగ్, చక్కెర శాఖ మంత్రి శివానంద పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బెళగావి జిల్లా అథని తాలూకా సుత్తట్టి గ్రామంలో సహకార సంఘాల 75వ వార్షికోత్సవం సందర్భంగా
వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామన్నారు
పరిహారం అందక రైతుల ఆత్మహత్యలు పెరిగాయి!
కర్ణాటక మంత్రి శివానంద పాటిల్ వ్యాఖ్యలు
బెంగళూరు, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): కరువు కోసం రైతులు ఎదురుచూస్తున్నారని కర్ణాటక వ్యవసాయ మార్కెటింగ్, చక్కెర శాఖ మంత్రి శివానంద పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బెళగావి జిల్లా అథని తాలూకా సుత్తట్టి గ్రామంలో సహకార సంఘాల 75వ వార్షికోత్సవంలో మంత్రి ప్రసంగిస్తూ.. రైతులు కరువుపై ఆశలు పెట్టుకున్నారని, అందుకు కారణం గత ప్రభుత్వాలు కరువు కాలంలో రుణమాఫీ చేయడమేనని అన్నారు. ప్రభుత్వం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందని, రుణమాఫీ అసాధ్యమని అన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని రైతులు పంటలు సాగు చేయాలని కోరారు. గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు ఉచితంగా విత్తనాలు, ఎరువులు ఇచ్చారని తెలిపారు. రైతులు తాగి మరణించినా, గుండెపోటు వచ్చినా ఆత్మహత్యకు పాల్పడి నష్టపరిహారం పొందుతారని వ్యాఖ్యానించారు. 2015లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందించడం ప్రారంభించారని, అప్పటి నుంచి ఆత్మహత్యలు పెరిగాయన్నారు. 2014, 2015లో ఎంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారు? అన్నదాతలను శివానంద పాటిల్ అవమానించారని బీజేపీ నేతలు మండిపడ్డారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలు ఆందోళనలు నిర్వహించారు. శివానంద పాటిల్ను వెంటనే మంత్రి పదవి నుంచి తప్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర డిమాండ్ చేశారు. అయితే లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాల కోసమే తన వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి శివానంద పాటిల్ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.
నవీకరించబడిన తేదీ – డిసెంబర్ 26, 2023 | 01:02 AM