టీమ్ ఇండియా: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్లో టీమిండియా పేలవమైన ఆరంభాన్ని అందుకుంది. దీనికి కారణం జట్టు ఎంపిక. ఈ టెస్ట్ సిరీస్ ICC టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 కింద నిర్వహించబడుతోంది. ఈ మేరకు ప్రతి టెస్టులో విజయం సాధించడం చాలా ముఖ్యం. అయితే భారత జట్టు మేనేజ్మెంట్ ఆలోచన చాలా కఠినంగా ఉందని చాలా మంది విమర్శిస్తున్నారు.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ ఆడుతోంది. టీ20 సిరీస్ను సమం చేసిన భారత్ వన్డే సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అయితే రెండు టెస్టుల సిరీస్లో టీమ్ఇండియా పేలవ ఆరంభాన్ని అందుకుంది. దీనికి కారణం జట్టు ఎంపిక. ఈ టెస్ట్ సిరీస్ ICC టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 కింద నిర్వహించబడుతోంది. ఈ మేరకు ప్రతి టెస్టులో విజయం సాధించడం చాలా ముఖ్యం. అయితే భారత జట్టు మేనేజ్మెంట్ ఆలోచన చాలా కఠినంగా ఉందని చాలా మంది విమర్శిస్తున్నారు. పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా గాయాలతో ఇబ్బంది పడుతుండగా.. మంచి జట్టును ఎంపిక చేయకుండా టీ20 జట్టుతో టెస్టులు ఆడుతున్నారు.
మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఓపెనింగ్ స్థానాలకు అందుబాటులో ఉన్నప్పటికీ.. యశ్వీ జైశ్వాల్ను ఆడించాలా అని క్రికెట్ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. వన్ డౌన్ లో పుజారా లాంటి ఆటగాడు ఉన్నా.. సెలక్టర్లు అతడిని పరిగణనలోకి తీసుకోవద్దని సూచిస్తున్నారు. రహానెను పక్కన పెట్టినప్పుడు పుజారాను తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. పుజారా స్థానంలో గిల్ని తీసుకోవాలనే ఆలోచన ఉంటే, ధనాధన్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్కు బదులుగా టెస్ట్ ప్లేయర్ని ఎంపిక చేసి ఉండాల్సిందని అభిమానులు భావిస్తున్నారు. మొత్తానికి టీమ్ ఇండియా మేనేజ్ మెంట్ పునరాలోచించి తెల్ల బంతి యువ క్రికెటర్లకు రెడ్ బాల్ గేమ్ అప్పగించడం మానుకోవాలని క్రికెట్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
మరింత క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నవీకరించబడిన తేదీ – డిసెంబర్ 27, 2023 | 02:38 PM