SA Vs IND: సెంచూరియన్లో దక్షిణాఫ్రికా-భారత్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో రోజు ముగిసింది. వెలుతురు లేకపోవడంతో అంపైర్లు షెడ్యూల్ కంటే ముందే ఆటను ముగించినట్లు ప్రకటించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 66 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది.

సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికా-భారత్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది. వెలుతురు లేకపోవడంతో అంపైర్లు షెడ్యూల్ కంటే ముందే ఆటను ముగించినట్లు ప్రకటించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 66 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. దీంతో టీమిండియా 11 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. చేతిలో ఇంకా ఐదు వికెట్లు ఉండడంతో సఫారీలకు భారీ ఆధిక్యం లభించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఓపెనర్ డీన్ ఎల్గర్ అద్భుత సెంచరీతో తన జట్టును ఆదుకున్నాడు. 113 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా డేవిడ్ బెడింగ్ హామ్తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఎల్గర్ మరియు బెడింగ్హామ్ మధ్య 131 పరుగుల భాగస్వామ్యం. బెడింగ్హామ్ అవుటైన వెంటనే దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వెలుతురు సరిగా లేకపోవడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు.
టీమిండియా బౌలర్లలో బుమ్రాకు రెండు, సిరాజ్కు రెండు వికెట్లు దక్కాయి. అరంగేట్రం బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఒక వికెట్ తీశాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 208/8తో రెండో రోజు ఆట కొనసాగుతుండగా, టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్లో 67.4 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ ఒంటరి పోరాటం చేశాడు. కేఎల్ రాహుల్ 137 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్లో ఓపెనర్ ఐడెన్ మార్క్రామ్(5), కీగన్ పీటర్సన్(2), టోనీ డి జోర్జి(28) విఫలమయ్యారు.
మరింత క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నవీకరించబడిన తేదీ – డిసెంబర్ 27, 2023 | 09:40 PM