కేతిరెడ్డి: పార్లమెంట్ ఎన్నికల్లో నేను స్టాలిన్‌కు మద్దతిస్తాను

కేతిరెడ్డి: పార్లమెంట్ ఎన్నికల్లో నేను స్టాలిన్‌కు మద్దతిస్తాను

ABN
, ప్రచురించిన తేదీ – జనవరి 06 , 2024 | 12:55 PM

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమికి మద్దతు ఇస్తామని తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రకటించారు.

కేతిరెడ్డి: పార్లమెంట్ ఎన్నికల్లో నేను స్టాలిన్‌కు మద్దతిస్తాను

– కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి

చెన్నై, (ఆంధ్రజ్యోతి): వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమికి మద్దతు ఇస్తామని తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రకటించారు. త్వరలో చెన్నైలో జరగనున్న తెలంగాణ ముఖ్యమంత్రి విజయోత్సవ సభకు మంత్రి ఉదయనిధిని ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. శుక్రవారం అపోలో హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి ఇంట్లో కేతిరెడ్డి పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ప్రతాప్ సి రెడ్డి ఆశీస్సులు పొందారు. అనంతరం కేతిరెడ్డి జన్మదినం సందర్భంగా పలు ఆయాలలో పూజలు, అన్నదానం, వృద్ధులకు పండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు జరిగాయి. అమింజికరైలోని హోప్ పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్‌లో కేతిరెడ్డి పుట్టినరోజును కూడా జరుపుకున్నారు. తెలుగు యువశక్తి కార్యవర్గ సభ్యులు డి.శివశంకర్ రెడ్డి, బి.వర్ధన్, ప్రభాకర్, జి.బాబు, ఎవి బాలాజీ, సుధాకర్, సిఎ హరీష్, పి.ఉదయకుమార్, పి.ఆదామ్, వసంతప్రభ, టామ్స్ అధినేత గొల్లపల్లి ఇజ్రాయెల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ.. తెలుగు భాష కోసం చేస్తున్న కృషి సంతోషంగా ఉందన్నారు. భాషల అణచివేతను కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని అన్నారు. ఇక్కడ తెలుగువారు వివిధ పార్టీల్లో మంత్రులుగా పనిచేసినా మాతృభాషపై ప్రేమ కొరవడిందన్నారు.

నవీకరించబడిన తేదీ – జనవరి 06, 2024 | 12:55 PM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *