మొహాలి: భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య టీ20 సిరీస్కు సమయం ఆసన్నమైంది. గురువారం నుంచి ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. జూన్లో జరగనున్న టీ20 ప్రపంచకప్కు ముందు పొట్టి ఫార్మాట్లో టీమిండియా ఆడనున్న చివరి ద్వైపాక్షిక సిరీస్ ఇదే కావడం గమనార్హం. ప్రపంచకప్కు ముందు తమ బలాన్ని అంచనా వేసుకునేందుకు భారత్కు ఇదే చివరి అవకాశం. ఈ సిరీస్ ద్వారా టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20 ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. 14 నెలల తర్వాత ఈ సీనియర్లిద్దరూ టీ20 జట్టులో కనిపించనున్నారు. దీంతో ఈ సిరీస్పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్కు రోహిత్ శర్మ కూడా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
ఈ సిరీస్ ద్వారా రోహిత్ శర్మ కెప్టెన్గా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును సమం చేసే అవకాశం ఉంది. టీ20 ఫార్మాట్లో టీమిండియాకు ధోనీ 42 విజయాలు అందించాడు. కెప్టెన్గా రోహిత్ శర్మ భారత జట్టుకు 39 విజయాలు అందించాడు. దీంతో అఫ్గానిస్థాన్తో జరిగే 3 మ్యాచ్ల సిరీస్లో టీమిండియా గెలిస్తే కెప్టెన్గా ధోనీ రికార్డును రోహిత్ శర్మ సమం చేస్తాడు. ధోనీ 72 మ్యాచుల్లో 42 మ్యాచ్లు గెలుపొందగా, ఇప్పటివరకు రోహిత్ శర్మ 51 మ్యాచ్ల్లో 39 మ్యాచ్లు గెలిచాడు. దీంతో టీ20 ఫార్మాట్లో కెప్టెన్గా రోహిత్ సాధించిన విజయాల శాతం 76 కాగా.. టీమిండియాకు అత్యధిక శాతం విజయాలు అందించిన కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచాడు. విరాట్ కోహ్లీ 60 శాతం విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లి 50 టీ20 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించగా, 30 మ్యాచ్లు గెలిచాడు.
ఆఫ్ఘనిస్థాన్తో టీ20కి భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమ్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ సింగ్ యాదవ్, , అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్
నవీకరించబడిన తేదీ – జనవరి 10, 2024 | 11:58 AM