బీజేపీతోనే దళితులకు న్యాయం: మాజీ సీఎం..

బీజేపీతోనే దళితులకు న్యాయం: మాజీ సీఎం..

ABN
, ప్రచురణ తేదీ – జనవరి 20, 2024 | 01:33 PM

అయోధ్య విమానాశ్రయానికి వాల్మీకి మహర్షి పేరు పెట్టడం చారిత్రాత్మక నిర్ణయమని, దళితులకు పూర్తి న్యాయం బీజేపీతోనే సాధ్యమని బీజేపీ జాతీయ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, మాజీ సీఎం యడ్యూరప్ప అన్నారు.

బీజేపీతోనే దళితులకు న్యాయం: మాజీ సీఎం..

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): అయోధ్య విమానాశ్రయానికి వాల్మీకి మహర్షి పేరు పెట్టడం చారిత్రాత్మక నిర్ణయమని, దళితులకు పూర్తి న్యాయం బీజేపీతోనే సాధ్యమని బీజేపీ జాతీయ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, మాజీ సీఎం యడ్యూరప్ప అన్నారు. బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సమావేశం శుక్రవారం బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ప్రారంభమైంది. భాజపా విజయాల్లో దళితులదే కీలకపాత్ర అని, ఈసారి ఏకతాటిపై 28 పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ ఘనవిజయం సాధించి ప్రధానికి కానుకగా అందజేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం శతాబ్దాలుగా అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఎన్నో చారిత్రాత్మక చర్యలు చేపట్టిందన్నారు. కాంగ్రెస్ బ్రాండ్ సామాజిక న్యాయం బూటకమన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు జనజీవన స్రవంతిలోకి రాకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనంగా నిలిచిపోతుందన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహర్షి వాల్మీకి జయంతిని ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. బొమ్మై ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రిజర్వేషన్లు పెంచారన్నారు. దళితులకు బీజేపీ నిజమైన మిత్రుడు.

22న సెలవు ప్రకటించాలి

కాగా, అయోధ్యలోని రామమందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపన జరిగే ఈ నెల 22వ తేదీని రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర డిమాండ్ చేశారు. ఎస్టీ మోర్చా సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హాఫ్ డే సెలవు ప్రకటించిందని, దేశంలోని చాలా రాష్ట్రాలు సెలవు ప్రకటించాయని తెలిపారు. దేశంలోని 140 కోట్ల మందికి శ్రీరామచంద్రుడు ఆదర్శం. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ చూసేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. బీజేపీ ఎప్పుడూ ఎస్టీలకు సముచిత ప్రాధాన్యత ఇస్తుందని, ఎస్టీ వర్గానికి చెందిన ద్రౌపదిమూర్ములకు రాష్ట్రపతి పదవిని అప్పగిస్తూ ప్రధాని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. దళితులపై కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోందని, ఆ పార్టీ ఉచ్చులో చిక్కుకోవద్దని అన్నారు. దళితులకు సంపూర్ణ న్యాయం బీజేపీతోనే సాధ్యమని యడ్యూరప్ప హామీ ఇచ్చారు. సమావేశంలో మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, మాజీ మంత్రులు బి శ్రీరాములు, బాలచంద్రజార్కిహోళి, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు బంగారు హనుమంతు తదితరులు ప్రసంగించారు. రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ నాయకులు పాల్గొన్నారు.

నవీకరించబడిన తేదీ – జనవరి 20, 2024 | 01:33 PM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *