నటుడిగా 50 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని వీకే నరేష్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి

వీకే నరేష్
నటుడిగా 50 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని వీకే నరేష్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్లే నటుడిగా తన సుదీర్ఘ కెరీర్ సాధ్యమైందని అన్నారు. జీవితాంతం పరిశ్రమకు సేవ చేస్తానన్నారు. తన ఊహ తెలిసినప్పటి నుంచి సినిమాల చుట్టూ పెరిగిన తనకు ఇదే జీవితం కావాలని అన్నారు. తొమ్మిదేళ్లకే ‘పండంటి కాపురం’ వంటి సినిమాతో బాలనటుడిగా తెరంగేట్రం చేయడం, ఎస్వీఆర్ లాంటి గొప్ప నటులతో కలిసి పనిచేయడం జీవితంలో మరిచిపోలేని అనుభూతి. ఒక్క సినిమాలో హీరోగా నటిస్తే చాలు అనుకున్న తనకు ఇంత సుదీర్ఘ సినీ కెరీర్ అందించిన ప్రేక్షకులకు రుణపడి ఉంటానని అన్నారు. నంది అవార్డులను అందజేయకపోవడంపై నరేష్ స్పందిస్తూ.. ‘నంది అవార్డులను సినీ పరిశ్రమలో ఎంతో గౌరవంగా, గుర్తింపుగా భావిస్తారు. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు ఆ అవార్డులు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. దీని వల్ల ఒక తరం నటీనటులకు అసలు నంది అవార్డులేంటో తెలిసే అవకాశం కూడా ఉండదు. నంది అవార్డులు ఇచ్చే సంప్రదాయాన్ని ప్రభుత్వం పునరుద్ధరించాలి. సేవాభావంతో రాజకీయాల్లోకి వచ్చానని, మారిన పరిస్థితులను తట్టుకోలేక బయటకు వచ్చానని, ప్రస్తుతానికి మళ్లీ అలా వెళ్లే ఆలోచన లేదని నరేష్ అన్నారు. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా తెలుగు ఇండస్ట్రీని మరో స్థాయికి తీసుకెళ్తుంది. నటుడిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే పాత్రలు ఎక్కువగా వస్తున్నాయని, నెగెటివ్ రోల్స్ చేయాలనుకుంటున్నానని చెప్పాడు.
నవీకరించబడిన తేదీ – జనవరి 20, 2024 | 12:17 AM