‘భారత్ జోడో న్యాయ యాత్ర’లో భాగంగా అస్సాంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. సోమవారం నాగావ్ జిల్లాలోని బోర్దువాలోని శ్రీశ్రీశ్రీ శంకర్ దేవ్ సత్ర ఆలయాన్ని సందర్శించేందుకు రాహుల్ను అధికారులు అనుమతించలేదు.
‘భారత్ జోడో న్యాయ యాత్ర’లో భాగంగా అస్సాంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. సోమవారం నాగావ్ జిల్లాలోని బోర్దువాలోని శ్రీశ్రీశ్రీ శంకర్ దేవ్ సత్ర ఆలయాన్ని సందర్శించేందుకు రాహుల్ను అధికారులు అనుమతించలేదు. రాహుల్తో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలను కూడా హైబోరాగావ్లో అడ్డుకున్నారు. అక్కడి నుంచి ముందుకు వెళ్లేందుకు వారిని అనుమతించలేదు. దీంతో ఆగ్రహించిన రాహుల్ గాంధీ.. తనను ఆపడానికి గల కారణాలేంటని ఆలయ సిబ్బందిని ప్రశ్నించారు. మరోవైపు మహిళా కాంగ్రెస్ నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. ఈ నిరసనలో రాహుల్ కూడా పాల్గొన్నారు.
“మేం ఆలయాన్ని సందర్శించాలనుకున్నాం.. కానీ.. మమ్మల్ని అడ్డుకున్నారు. నేను ఇక్కడికి రాకుండా ఏం నేరం చేశాను?” అని రాహుల్ గాంధీ మండిపడ్డారు.ఇప్పుడు గుడిలోకి ఎవరు వెళ్లాలో ప్రధాని మోదీ నిర్ణయిస్తారా? అని విమర్శించారు. తాము ప్రార్థన చేసుకునేందుకే ఈ ఆలయానికి వచ్చామని.. సమస్యలు సృష్టించడం లేదని.. శంకరదేవుడి జన్మస్థలానికి వెళ్లేందుకు అనుమతి లేదని, శాంతిభద్రతల సమయంలో ఇతరులు వెళ్లవచ్చా అని రాహుల్ నిలదీశారు. ఈ విషయంపై నిప్పులు చెరిగారు.స్థానిక అధికారుల చర్యను ఖండిస్తూ, మనమందరం ప్రజాస్వామ్య దేశంలో జీవిస్తున్నామని, అయితే స్థానిక ఎంపీ గౌరవ్ గొగోయ్ కూడా ఆలయాన్ని సందర్శించకుండా ఆపుతున్నారని, ఇది అన్యాయమని అన్నారు.
అదే సమయంలో, కాంగ్రెస్ సేవాదళ్ చీఫ్ లాల్జీ దేశాయ్ కూడా ఆలయంలో ప్రార్థనలు చేయకుండా రాహుల్ గాంధీని అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సిగ్గుమాలిన పరిస్థితిగా అభివర్ణించిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోదీ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మలపై విమర్శలు చేశారు. ప్రజలు ఎప్పుడు, ఎక్కడ ప్రార్థనలు చేయాలనేది ప్రభుత్వమే నిర్దేశిస్తోందని.. ఈ విషయంలో ప్రజాస్వామ్యం లేదని దేశాయ్ పేర్కొన్నారు. కాగా, రాహుల్ గాంధీకి మధ్యాహ్నం 3 గంటలకు ఆలయ దర్శనానికి అనుమతి లభించినట్లు అధికారులు తెలిపారు. అయితే.. ముందుగా ఆయనను అడ్డుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరాధనా స్వేచ్ఛ అనేది మతపరమైన ఆచారాలను నియంత్రించడంలో ప్రభుత్వ పాత్ర గురించి చర్చకు దారితీసింది.
నవీకరించబడిన తేదీ – జనవరి 22, 2024 | 03:26 PM