చివరిగా నవీకరించబడింది:
బీహార్లో మహాఘట్బంధన్ అధ్యాయం ముగిసిందని చెప్పవచ్చు. రాజకీయ మనుగడ కోసం ముఖ్యమంత్రి కావాలంటే బీజేపీతో చేతులు కలపాల్సిందే. ఏడాదిన్నర క్రితం నితీశ్ బీజేపీని వీడి ఆర్జేడీ-కాంగ్రెస్తో కలిసి మహాఘట్బంధన్ ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం కుర్చీలో కూర్చున్నారు.
సీఎం నితీష్ కుమార్: బీహార్లో మహాఘటబంధన్ అధ్యాయం ముగిసిందని చెప్పవచ్చు. రాజకీయ మనుగడ కోసం ముఖ్యమంత్రి పదవి కావాలంటే బీజేపీతో చేతులు కలపాల్సిందే. ఏడాదిన్నర క్రితం నితీశ్ బీజేపీని వీడి ఆర్జేడీ-కాంగ్రెస్తో కలిసి మహాఘట్బంధన్ ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం కుర్చీలో కూర్చున్నారు. ఏడాదిన్నర తర్వాత నితీష్ బీజేపీతో చేతులు కలిపేందుకు ముందుకు వచ్చారు.
రేపు ప్రమాణ స్వీకారం..(సీఎం నితీశ్ కుమార్)
కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేసేందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సిద్ధంగా ఉన్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ ఎమ్మెల్యేల మద్దతు లేఖలను అధికారికంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు అందజేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 7 గంటలకు రాజ్భవన్ను నితీశ్కుమార్ సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆయన తన రాజీనామాను సమర్పించి, తాజా కూటమితో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆదివారం రాజ్భవన్లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. లాలూయాదవ్కు చెందిన ఆర్జేడీకి 79, బీజేపీకి 78, నితీష్ కుమార్కు చెందిన జేడీయూకి 45, కాంగ్రెస్కు 19, లెఫ్ట్ పార్టీలకు 14 సీట్లు ఉన్నాయి. 243 మంది సభ్యులున్న అసెంబ్లీలో మహాఘట్బంధన్కు 160 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. హిందుస్థాన్ అవామ్ మోర్చా – సెక్యులర్కు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా బీజేపీ వెంటే ఉన్నారు. ప్రస్తుతం జేడీయూ, బీజేపీ, హెచ్ఏఎం-ఎస్ కలిస్తే మ్యాజిక్ ఫిగర్ సులువుగా 122కి చేరుతుంది.
మరోవైపు, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకులు శనివారం పాట్నాలోని పార్టీ అధినేత లాలూ ప్రసాద్ ఇంటికి ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి తరలివచ్చారు. మహాఘట్బంధన్లో ఆర్జేడీ మిత్రపక్షాలు ఎప్పుడూ ముఖ్యమంత్రిని గౌరవించేవారని తేజస్వీ యాదవ్ చెప్పినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో జరిగిన అనేక అనూహ్య పరిణామాలపై తేజస్వి పలు సూచనలు చేశారని ఆ వర్గాలు తెలిపాయి.