కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ప్రియాంక గాంధీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి పోటీ చేస్తారని గత రెండు రోజులుగా చర్చ జరుగుతోంది. ఢిల్లీ నుంచి బెంగళూరు వరకు ఇదే హాట్ టాపిక్గా మారింది.

– ఢిల్లీ నేతల పర్యవేక్షణలో సర్వేలు
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ప్రియాంక గాంధీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి పోటీ చేస్తారని గత రెండు రోజులుగా చర్చ జరుగుతోంది. ఢిల్లీ నుంచి బెంగళూరు వరకు ఇదే హాట్ టాపిక్గా మారింది. ప్రియాంక గాంధీ రాష్ట్రం నుంచి పోటీ చేస్తే ఎక్కువ సీట్లు గెలవవచ్చని రాష్ట్ర పార్టీ నేతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందుకే సేఫ్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కొప్పాల నియోజ క వ ర్గంలో ఢిల్లీ పెద్ద ల ప ర్య వేక్ష ణ లో ఉన్న బృందాలు రాష్ట్ర నేత ల కు స మాచారం ఇవ్వ కుండా స ర్వే నిర్వ హించిన ట్లు స మాచారం. తెలంగాణ నుంచి కూడా ప్రియాంక గాంధీ పోటీ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. దక్షిణాదిలో రెండు రాష్ట్రాల్లో బలమైన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నందున ఇక్కడ ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకునేందుకు వీలుగా ఇక్కడి నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఆ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తున్నారు. ఈ ప్రచారంపై సమగ్ర సమాచారం లేకపోవడంతో రాష్ట్రంలోని ముఖ్య నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. బీజేపీకి చెందిన కొప్పాల లోక్సభ సభ్యుడు కారడి సంగన్నపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఆయనకు కాకుండా వేరొకరికి టికెట్ ఇవ్వాలని నియోజకవర్గంలోని ముఖ్యనేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. సంగన్నకు మళ్లీ టికెట్ ఇస్తే సహకరించేది లేదని ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్రను కలిసిన స్థానిక నేతలు చెప్పినట్లు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో పాటు ఎన్నికల ముందు ప్రకటించిన ఐదు హామీల అమలుతో లోక్ సభ ఎన్నికల్లో గెలుపు సులువవుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. కొప్పాలలో 8 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా, ఆరు స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో గాలి జనార్దనరెడ్డి, మరో స్థానంలో బీజేపీ గెలుపొందాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నందున ఆమె గెలుస్తుందన్న అంచనాలతో ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తున్నట్లు సమాచారం.
గాంధీ కుటుంబంతో రాష్ట్రానికి దశాబ్దాల అనుబంధం ఉంది
గాంధీ కుటుంబంతో రాష్ట్రానికి దశాబ్దాలుగా ప్రత్యేక అనుబంధం ఉంది. ఇందిరా గాంధీ రాజకీయ పునర్జన్మ ఇక్కడి నుంచే సాధ్యమైంది. 1999లో ఇందిరాగాంధీ చిక్కమగళూరు నుంచి గెలుపొందగా, సోనియాగాంధీ బళ్లారి నుంచి గెలుపొందారు.అదే విధంగా ప్రియాంక గాంధీని కూడా రాష్ట్రం నుంచి పోటీ చేయాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక గాంధీ పోటీపై రెండు వారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
నవీకరించబడిన తేదీ – జనవరి 30, 2024 | 01:14 PM