హీరో విజయ్: జూలై నుంచి రాష్ట్రవ్యాప్తంగా రోడ్‌షోలు.

హీరో విజయ్: జూలై నుంచి రాష్ట్రవ్యాప్తంగా రోడ్‌షోలు.

– తిరుచ్చిలో మహానాడుకు సన్నాహాలు

– త్వరలో పార్టీకి జెండా రూపకల్పన

– తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ వ్యూహం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ‘తమిళగ వెట్రి కళగం’ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు విజయ్ లోక్ సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. అలాగే పార్టీ తొలి మహానాడును తిరుచ్చి లేదా కడలూరులో నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని పెడుతున్నట్లు విజయ్ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమాల షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత పూర్తిగా రాజకీయ కార్యకలాపాలపై దృష్టి పెట్టనున్నాడు. విజయ్ మక్కల్ ఇయక్కం ప్రధాన కార్యదర్శి బుస్సి నేతృత్వంలో ఆ సంస్థ సీనియర్ నాయకులందరికీ పార్టీ సభ్యత్వం అందించే పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో పార్టీ ఆశయాలు, నియమావళి, భవిష్యత్తు కార్యాచరణ, పార్టీ జెండా, గుర్తు తదితర అంశాలపై మక్కల్ ఇయక్కం సీనియర్ నేతలతో విజయ్ సమగ్రంగా చర్చించి.. పార్టీ విధివిధానాలు, ఆకాంక్షలను ఖరారు చేసి.. నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్‌షోలు.

బహిరంగ సభలు… రోడ్‌షోలు

కోయంబత్తూరు, తిరుచ్చి, కడలూరు, మధురై తదితర నగరాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని, అదే సమయంలో గ్రామాల్లో రోడ్‌షోలు నిర్వహించి స్థానిక ప్రజలకు చేరువయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. జూలై లేదా ఆగస్టులో విజయ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారని అంటున్నారు. అలాగే రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లోనూ ఆయన పర్యటిస్తారని చెబుతున్నారు. 2011లో తన అభిమాన సంఘాల ఆధ్వర్యంలో నాగపట్నంలో భారీ మహానాడు నిర్వహించారు. ఆ మహానాడుకు లక్షలాది మంది ప్రజలు, మత్స్యకారులు హాజరయ్యారు. మహానాడు జనసందోహాన్ని చూసి రెండు ద్రవిడ పార్టీల నేతలు అవాక్కయ్యారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నిర్వహించనున్న పార్టీ మహానాడును కూడా అదే స్థాయిలో అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించారు.

శుభాకాంక్షలు కమల్…

తన రాజకీయ పార్టీని ప్రారంభించిన విజయ్‌కి మక్కల్ నీది మయ్యం అధినేత కమలహాసన్ శుభాకాంక్షలు తెలిపారు. విజయ్‌కి ఫోన్ చేసి రాజకీయ రంగంలోనే కాకుండా సినిమా రంగంలో కూడా ఎన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. డీఎంకే ఎంపీ కనిమొళి స్పందిస్తూ.. విజయ్ రాజకీయాల్లోకి రావడం వల్ల 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు ఎలాంటి నష్టం వాటిల్లదని అన్నారు. అదే సమయంలో ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చని, ప్రజాభిమానం ఉంటే ఉన్నత స్థానానికి చేరుకుంటారని అన్నారు. పార్టీని ప్రారంభించిన విజయ్‌కి శుభాకాంక్షలు తెలిపారు.

తమిళిసై వ్యాఖ్య…

నటుడు విజయ్ రాజకీయ పార్టీని ప్రారంభించడం పట్ల పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒకే కుటుంబానికి చెందిన రాజకీయ నాయకులు ఉండడం సరైన పద్దతి కాదంటూ డీఎంకేపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఏ రంగానికి చెందిన వారైనా రాజకీయాల్లోకి రావచ్చని, రాష్ట్రానికి వైయస్‌తో పాటు పలువురు రాజకీయ నేతలు అవసరమని ఆమె అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *