ఢిల్లీ: టోల్ గేట్ల వద్ద జాప్యం జాతీయ రహదారులపై లాంగ్ డ్రైవ్ చేసే నాలుగు చక్రాల వాహనదారులకు ప్రధాన సమస్య. ఫాస్టాగ్ రూపంలో కొంత ఉపశమనం లభించినా, పెరుగుతున్న వాహనాలతో టోల్ గేట్లు కిక్కిరిసిపోతున్నాయి. 2018-19లో టోల్ ప్లాజా వద్ద వాహనాల సగటు నిరీక్షణ సమయం 8 నిమిషాలు. 2020-22 సంవత్సరంలో ఫాస్ట్ట్యాగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టడంతో, వాహనాల సగటు నిరీక్షణ సమయం 47 సెకన్లకు తగ్గింది.
అయినా టోల్ గేట్ల వద్ద రద్దీ తగ్గలేదు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుభవార్త అందించారు. రానున్న రోజుల్లో హైవే టోల్ ప్లాజాల స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నట్లు గడ్కరీ ఆదివారం ప్రకటించారు. దేశంలోని పలు హైవేలపై మొదటగా వీటిని అమలు చేసేందుకు చర్యలు చేపట్టామని వివరించారు.
ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సలహాదారుని నియమించిందని తెలిపారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతోపాటు హైవేలపై ప్రయాణించే కచ్చితమైన దూరానికి వాహనదారుల నుంచి చార్జీలు వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ప్రభుత్వ యాజమాన్యంలోని NHAI వార్షిక టోల్ ఆదాయం రూ. 40,000 కోట్లు వస్తున్నాయని, రానున్న 2-3 ఏళ్లలో టోల్ ద్వారా రూ.1.40 లక్షల కోట్ల ఆదాయాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గడ్కరీ తెలిపారు.
దేశంలోని టోల్ ప్లాజాల స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్తో సహా కొత్త టెక్నాలజీలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన వివరించారు. ఆరు నెలల్లో ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందన్నారు. 2021 నుండి ఫాస్ట్ట్యాగ్లు తప్పనిసరి చేయబడతాయి మరియు అది లేని వాహనాలు టోల్ రుసుము రెట్టింపు చెల్లించవలసి ఉంటుంది. నగరాలకు సమీపంలో, జనసాంద్రత ఎక్కువగా ఉన్న పట్టణాల్లో వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గినప్పటికీ, రద్దీ సమయాల్లో టోల్ ప్లాజాల వద్ద ఎక్కువ ఆలస్యం జరుగుతుంది.
GPS టోల్ సిస్టమ్ గురించి..
GPS ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్లో హైవేలపై కెమెరాలను ఇన్స్టాల్ చేయడం ఉంటుంది. ఈ కెమెరాలలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) వ్యవస్థను అమర్చారు. వాహనం ప్రయాణించిన దూరం ఆధారంగా ఇది టోల్ వసూలు చేస్తుంది. ప్రస్తుతం, ఫాస్ట్ట్యాగ్ ప్లాజాలు RFID ఆధారిత టోల్ సేకరణ వ్యవస్థను ఉపయోగిస్తున్నాయి.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి చేయండి