విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు కాస్త చులకనగా మాట్లాడాడు. రామాయణం, మహాభారతంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారిలో ఒక వర్గం ఆ టీచర్పై నిరసన వ్యక్తం చేసింది. ఈ నిరసనకు బీజేపీ ఎమ్మెల్యే కూడా మద్దతు తెలిపారు.

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు కాస్త చులకనగా మాట్లాడాడు. రామాయణం, మహాభారతంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారిలో ఒక వర్గం ఆ టీచర్పై నిరసన వ్యక్తం చేసింది. ఈ నిరసనకు బీజేపీ ఎమ్మెల్యే కూడా మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుడిని పాఠశాల నుంచి తొలగించాల్సి వచ్చింది. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తీరప్రాంత పట్టణమైన మంగళూరులోని సెయింట్ గెరోసా ఇంగ్లీష్ హెచ్ఆర్ ప్రైమరీ స్కూల్లో ఓ మహిళ టీచర్గా పనిచేస్తున్నారు. ఇటీవల విద్యార్థులకు విద్యాబుద్ధులు చెబుతూ రామాయణం, మహాభారతాలు కేవలం కల్పిత కథలేనని చెప్పారు. అంతేకాదు ఆమె ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడినట్లు ఆరోపణలు వచ్చాయి. 2002 గోద్రా అల్లర్లు, బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులను ఆమె ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ విషయం వెలుగులోకి రావడంతో.. ఆ టీచర్పై రైట్వింగ్ గ్రూప్ నిరసనకు దిగింది. పిల్లల మదిలో ద్వేషం నింపేందుకు టీచర్ ప్రయత్నిస్తున్నారని ఆ బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీజేపీ ఎమ్మెల్యే వేద్యాస్ కామత్ కూడా ఈ బృందానికి మద్దతు తెలిపారు.
ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నిరసన తెలిపారు. నిరసనల్లో ఎమ్మెల్యే కూడా పాల్గొనడంతో ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా.. ‘‘సెయింట్ గెరోసా పాఠశాలకు 60 ఏళ్ల చరిత్ర ఉంది. ఇప్పటి వరకు ఇలాంటి ఘటన జరిగిన దాఖలాలు లేవు. ఈ దురదృష్టకర సంఘటన తాత్కాలిక అపనమ్మకాన్ని సృష్టించింది. ఆ టీచర్ని సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం… విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు దోహదపడుతుంది. విద్యార్థుల భవిష్యత్తు కోసం అందరం కలిసి మెరుగ్గా పని చేస్తామంటూ పాఠశాల ఓ లేఖ విడుదల చేసింది. మరోవైపు ఈ కేసును డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ (డీడీపీఐ) దర్యాప్తు చేస్తున్నారు.
నవీకరించబడిన తేదీ – ఫిబ్రవరి 12, 2024 | 09:50 PM