MSPకి చట్టబద్ధత ఇవ్వాలి MSPకి చట్టబద్ధత ఇవ్వాలి

MSPకి చట్టబద్ధత ఇవ్వాలి MSPకి చట్టబద్ధత ఇవ్వాలి

ABN
, ప్రచురణ తేదీ – ఫిబ్రవరి 15, 2024 | 02:57 AM

కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని రైతు సంఘాల నేతలు నిర్ణయించారు. రైతు నాయకుడు సర్వన్ సింగ్ పండిర్ మీడియాతో మాట్లాడారు.

MSPకి చట్టబద్ధత ఇవ్వాలి

రైతు సంఘాల డిమాండ్

కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని రైతు సంఘాల నేతలు నిర్ణయించారు. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పలువురు రైతులు గాయపడ్డారని, పలువురు అస్వస్థతకు గురయ్యారని రైతు నాయకుడు సర్వన్‌సింగ్ పండిర్ మీడియాకు తెలిపారు. కేంద్రం ఇలాంటి చర్యలకు స్వస్తి చెప్పి తమను చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. కేంద్రంతో తాము ఘర్షణకు దిగలేదని, న్యాయమైన డిమాండ్ల సాధన కోసమే తమ పోరాటమని వివరించారు. మరో నాయకుడు జగ్జిత్‌సింగ్ దల్లెవాల్ కూడా ఎంఎస్‌పి తమ ప్రధాన డిమాండ్ అని, స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలని అన్నారు.

మోదీది నియంతృత్వ పోకడ: కాంగ్రెస్‌

రైతులపై పోలీసుల దాడిని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. మంగళవారం జరిగిన దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైతు గుర్మీత్ సింగ్‌ను ఆయన ఫోన్‌లో పరామర్శించారు. దేశానికి అన్నం పెట్టే రైతులపై ప్రధాని మోదీ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని అన్నారు. తాము రైతులకు అండగా ఉంటామని గుర్మీత్‌కు ధైర్యం చెప్పారు. కాగా, జార్ఖండ్‌లో బుధవారం నుంచి ప్రారంభం కావాల్సిన రెండో దశ భారత్ జోడో న్యాయ యాత్ర రద్దు చేయబడింది. ఢిల్లీలో రైతుల ఆందోళనలో పాల్గొనేందుకు రాహుల్ దేశ రాజధానికి వెళ్లడంతో యాత్రను రద్దు చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్ ఇప్పటిది కాదని, 2011లో కూడా గుజరాత్ సీఎంగా మోడీ అదే డిమాండ్ చేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరమేష్ గుర్తు చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ మోదీ ఎంఎస్‌పీని ప్రస్తావించారని అన్నారు.

నవీకరించబడిన తేదీ – ఫిబ్రవరి 15, 2024 | 07:53 AM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *