IND vs ENG: యశస్వి జైస్వాల్ విధ్వంసం.. 9 ఫోర్లు, 5 సిక్సర్లతో మెరుపు సెంచరీ

IND vs ENG: యశస్వి జైస్వాల్ విధ్వంసం.. 9 ఫోర్లు, 5 సిక్సర్లతో మెరుపు సెంచరీ

రాజ్‌కోట్: మూడో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ విధ్వంసం సృష్టించాడు. వన్డే తరహా బ్యాటింగ్ తో దుమ్ము రేపిన జైస్వాల్ 122 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో అద్భుత సెంచరీ నమోదు చేశాడు. బౌండరీ కొట్టి సెంచరీ పూర్తి చేసిన జైస్వాల్ అంతకుముందు సిక్సర్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్‌కి ఈ సిరీస్‌లో ఇది వరుసగా రెండో సెంచరీ కాగా, టెస్టు కెరీర్‌లో మూడోది. 126 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా తొలి ఓవర్లో 9 పరుగులు చేసింది. జేమ్స్ అండర్సన్ వేసిన తొలి ఓవర్‌లో రోహిత్ శర్మ వరుసగా రెండు బౌండరీలు బాదాడు. కానీ 19 పరుగులు చేసిన రోహిత్ శర్మను 12వ ఓవర్లో రూట్ పెవిలియన్ చేర్చాడు. దీంతో టీమిండియా 30 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం శుభ్‌మన్ గిల్‌తో జతకట్టిన యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఆరంభంలో కాస్త నిదానంగా ఆడిన జైస్వాల్.. క్రీజులో నిలిచిన తర్వాత గేరు మార్చాడు.

27వ ఓవర్లో అండర్సన్ ఒక సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. టామ్ హార్ట్లీ 28వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత జైస్వాల్ దూకుడు కొనసాగించి సెంచరీ సాధించాడు. తొలుత 73 బంతుల్లో 35 పరుగులతో ఆడిన జైస్వాల్.. ఆ తర్వాత 122 బంతుల్లోనే సెంచరీకి చేరాడు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో భారత్ స్కోరు 42 ఓవర్లలో వికెట్ నష్టానికి 172 పరుగులు. దీంతో ప్రస్తుతం ఇంగ్లండ్‌పై టీమిండియా 298 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. జైస్వాల్, గిల్ భాగస్వామ్యం కూడా 100 పరుగులు దాటింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఇంగ్లండ్ ముందు భారత జట్టు భారీ లక్ష్యాన్ని నిర్దేశించడం ఖాయంగా కనిపిస్తోంది. 207/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ ను భారత బౌలర్లు బుమ్రా, కుల్దీప్ యాదవ్ ధాటికి ఆరంభంలోనే దెబ్బకొట్టారు. రూట్ (18)ను బుమ్రా, బెయిర్‌స్టో జోడించగా, కుల్దీప్ యాదవ్ కీలక వికెట్‌గా తీశారు. ముఖ్యంగా బెయిర్ స్టోను డకౌట్ చేసిన కుల్దీప్.. కాసేపటి తర్వాత భారీ సెంచరీతో చెలరేగుతున్న బెన్ డకెట్ (153)ని కూడా ఔట్ చేశాడు. శుక్రవారం తన స్కోరుకు డకెట్ మరో 18 పరుగులు జోడించాడు. కానీ వన్డే తరహాలో బ్యాటింగ్ చేసిన డకెట్ 151 బంతుల్లో 23 ఫోర్లు, 2 సిక్సర్లతో 153 పరుగులు చేశాడు. ఫలితంగా ఇంగ్లండ్ 260 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది.

ఆ తర్వాత స్టోక్స్, ఫోక్స్ కాసేపు వికెట్లకు అడ్డుగా నిలిచారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 39 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యాన్ని 65వ ఓవర్లో రవీంద్ర జడేజా బ్రేక్ చేశాడు. 41 పరుగులు చేసిన స్టోక్స్ ను పెవిలియన్ చేర్చాడు. అనంతరం సిరాజ్ విరుచుకుపడ్డాడు. ఆ వెంటనే ఫాక్స్ (13)ను సిరాజ్ అవుట్ చేశాడు. ఫలితంగా ఇంగ్లండ్ 299 పరుగుల వద్ద 6, 7 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్‌ ఔట్‌ కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. రెహాన్ అహ్మద్(6), జేమ్స్ అండర్సన్(1)లను సిరాజ్ ఔట్ చేశాడు. టామ్ హార్ట్లీ(9)ని జడేజా ఔట్ చేశాడు. ఫలితంగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లతో చెలరేగాడు. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీశారు. బుమ్రా, అశ్విన్ ఒక్కో వికెట్ తీశారు. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 126 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది.

మరింత క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నవీకరించబడిన తేదీ – ఫిబ్రవరి 17, 2024 | 04:38 PM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *