టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ రంజీ ట్రోఫీని ఎంజాయ్ చేస్తున్నాడు. ముంబై తరఫున బరిలోకి దిగిన ముషీర్ ఖాన్ బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో విశ్వరూపం ప్రదర్శించాడు.

టీమ్ ఇండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ రంజీ ట్రోఫీని ఎంజాయ్ చేస్తున్నాడు. ముంబై తరఫున ఆడాడు ముషీర్ ఖాన్ బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో విశ్వరూపం ప్రదర్శించాడు. అజేయ డబుల్ సెంచరీ సాధించాడు. 128 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ముషీర్ ఖాన్ ఈరోజు డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ముషీర్ ఖాన్ తొలి సెంచరీ డబుల్ సెంచరీగా మారింది. ఒక దశలో 90 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ముంబైకి ముషీర్ అండగా నిలిచాడు. డబుల్ సెంచరీతో పాటు జట్టుకు భారీ స్కోరు కూడా అందించాడు. ముఖ్యంగా హార్దిక్ తమోర్ (57)తో కలిసి ఆరో వికెట్ కు 181 పరుగులు జోడించాడు. హాఫ్ సెంచరీ చేసిన హార్దిక్.. ముషీర్ ఖాన్ కు మంచి సహకారం అందించాడు. ముషీర్ ఖాన్ మొత్తం 357 బంతులు ఎదుర్కొని 18 ఫోర్లతో 203 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇటీవల ముగిసిన అండర్-19 ప్రపంచకప్లోనూ ముషీర్ ఖాన్ తన సత్తా చాటాడు. 2 సెంచరీలతో విజృంభించాడు.
ముషీర్ ఖాన్ డబుల్ సెంచరీతో ముంబై తొలి ఇన్నింగ్స్లో 384 పరుగులకు ఆలౌటైంది. ఇతర ముంబై బ్యాట్స్మెన్లలో పృథ్వీషా 33 పరుగులు, సూర్యాంశు షెడ్జే 20 పరుగులు చేశారు. టీమిండియా సీనియర్ ఆటగాళ్లు శార్దూల్ ఠాకూర్ 17, రహానే 3 పరుగులు మాత్రమే చేశారు. బరోడా బౌలర్లలో భార్గవ్ భట్ 7 వికెట్లతో చెలరేగాడు. నినాద్ రథ్వా 3 వికెట్లు తీశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి బరోడా జట్టు 2 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. శవత్ రావత్ (69), కెప్టెన్ విష్ణు సోలంకి (23) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం బరోడా జట్టు తొలి ఇన్నింగ్స్లో 257 పరుగుల వెనుకంజలో ఉంది.
మరింత క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నవీకరించబడిన తేదీ – ఫిబ్రవరి 24, 2024 | 08:16 PM