సీఏఏ చట్టం: కేంద్రం సంచలన నిర్ణయం.. పౌరసత్వ చట్టం అమల్లోకి వచ్చింది

న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. బిల్లు ఆమోదం పొందిన నాలుగేళ్ల తర్వాత చట్టంగా మారింది. సీసీఏ చట్టాన్ని అమలు చేస్తూ కేంద్ర హోంశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ చట్టం అమల్లోకి రావడంతో మత ప్రాతిపదికన తొలిసారిగా భారత పౌరసత్వం మంజూరు కానుంది. 2019లో దేశవ్యాప్తంగా CAAకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. దాదాపు 100 మంది చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. దీనిపై ప్రతిపక్ష రాజకీయ పార్టీల నేతలు తీవ్రంగా స్పందించారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ చట్టాన్ని అమలు చేయకూడదని చాలా రాష్ట్రాలు శాసనసభలో తీర్మానం కూడా చేశాయి. తీవ్ర వ్యతిరేకత మధ్య పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సీఏఏ అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. దీంతో 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన హామీని నెరవేర్చినట్లయింది.

CAA చట్టం ఏం చెబుతోంది?

డిసెంబర్ 31, 2014 వరకు బంగ్లాదేశ్, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన ముస్లిమేతర హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు మరియు క్రైస్తవులు భారత పౌరసత్వం పొందుతారు. CAA బిల్లును డిసెంబర్ 2019లో పార్లమెంట్ ఆమోదించింది. రాష్ట్రపతి కూడా ఆమోదించారు. పార్లమెంటులో బిల్లు ఆమోదానికి వ్యతిరేకంగా నిరసనలు, పోలీసుల చర్యలలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా, 2020 నుంచి పార్లమెంటరీ కమిటీ నిబంధనలను రూపొందిస్తోంది కాబట్టి హోం శాఖ ఎప్పటికప్పుడు నిబంధనల నోటిఫికేషన్‌ను పొడిగిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి చట్టం అమలుపై వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

సుప్రీంకోర్టు: ఎస్‌బీఐ బాండ్ల కేసులో ఆదేశాలను పాటించకుంటే ధిక్కార చర్యలు

ప్రధాని మోదీ: మూడోసారి నేనే ప్రధాని అవుతాను.. మహిళలకు ప్రాధాన్యం ఉన్న పథకాలను మోదీ తీసుకువస్తారు

మరింత జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి

నవీకరించబడిన తేదీ – మార్చి 11, 2024 | 06:36 PM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *