-
నేడు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం
-
తెలంగాణలో పలు స్థానాలపై క్లారిటీ వస్తోంది
న్యూఢిల్లీ, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): లోక్సభ ఎన్నికల అభ్యర్థుల రెండో జాబితాను మంగళవారం ప్రకటించేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఢిల్లీలోని ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో సోమవారం పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఉత్తమ్కుమార్రెడ్డి, అధిర్ రంజన్ చౌదరి, అంబికా సోనీ, ముకుల్ వాస్నిక్, టీఎస్ సింగ్ దేవ్ తదితర సీఈసీ సభ్యులు పాల్గొంటారు. భారత్ జోడో నయ్ యాత్రలో భాగంగా గుజరాత్లో ఉన్న రాహుల్ గాంధీ ఈ సమావేశానికి వర్చువల్గా హాజరుకానున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ సహా ఏడు రాష్ట్రాల్లో సీట్లకు అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
అనంతరం అభ్యర్థుల జాబితాను మంగళవారం విడుదల చేయనున్నారు. కాగా, ఈ జాబితాలో తెలంగాణకు సంబంధించిన పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు గాను ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా, తొలి జాబితాలో నల్గొండ, జహీరాబాద్, మహబూబ్నగర్, మహబూబాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు ఖరారు చేసినా.. రకరకాల సమీకరణాల కారణంగా తొలి జాబితాలో పేర్లు ప్రకటించలేదు. ఇప్పుడు రెండో రౌండ్లో నిజామాబాద్, చేవెళ్ల, సికింద్రాబాద్, మెదక్, పెద్దపల్లి తదితర స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్ తరపున చేవెళ్ల నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్, మెదక్ నుంచి నీలం మధు, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవలే కాంగ్రెస్లో చేరారు.
నవీకరించబడిన తేదీ – మార్చి 11, 2024 | 09:45 AM