
సీఎం అరవింద్ కేజ్రీవాల్: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు పంపింది. మార్చి 21న ఈడీ కార్యాలయానికి వచ్చి విచారణకు సహకరించాలని కేజ్రీవాల్ను దర్యాప్తు సంస్థ కోరింది. మద్యం పాలసీ కేసులో విచారణకు హాజరు కావాలని ఢిల్లీ సీఎంకు ఇప్పటికే ఎనిమిది సమన్లు జారీ చేసిన ఈడీ.. తొమ్మిదోసారి సమన్లు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను కోర్టు 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో హాజరయ్యేందుకు కేజ్రీవాల్కు ఈడీ ఇప్పటికే ఎనిమిది సమన్లు పంపింది. అయితే ఈడీ సమన్లపై కేజ్రీవాల్ స్పందించలేదని, ఈడీ సమన్లు అక్రమమని, మద్యం పాలసీ కేసు బీజేపీ కుట్ర రాజకీయాలలో భాగమని అన్నారు. కేజ్రీవాల్ తమ విచారణకు హాజరు కావడం లేదని ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో ఈడీ రెండు ఫిర్యాదులు దాఖలు చేసింది. ఈడీ సమన్ల కేసులో కేజ్రీవాల్ శనివారం ఉదయం ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. అయితే చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ మంజూరైన మరుసటి రోజే మరోసారి (తొమ్మిదోసారి) కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: ఎంసీసీ: దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్… ఏం చేయకూడదో తెలుసా?
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమెను కోర్టులో హాజరుపరచగా.. ఈ నెల 23 వరకు కస్టడీకి ఆదేశించింది. ఇదిలావుంటే, తొమ్మిదోసారి ఈడీ పంపిన సమన్లపై కేజ్రీవాల్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరేదైనా కారణాల వల్ల కేజ్రీవాల్ ఈడీ విచారణకు దూరంగా ఉంటారా అనేది తెలియాల్సి ఉంది. కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరైతే.. కవితతో పాటు ఆయనను కూడా విచారించాలని ఈడీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 కేసులో అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ విచారణలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ను మార్చి 21న విచారణలో పాల్గొనాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తొమ్మిదో సమన్లు జారీ చేసింది. .… pic.twitter.com/583sgBAbLo
– ANI (@ANI) మార్చి 17, 2024