భారత నావికాదళ మాజీ చీఫ్ అడ్మిరల్ (రిటైర్డ్) లక్ష్మీనారాయణ రాందాస్ అంత్యక్రియలు శనివారం ముగిశాయి. సికింద్రాబాద్లోని తిరుమలగిరి ఆర్టీసీ కాలనీలోని స్వర్గ వాటికలో కుటుంబ సభ్యులు, త్రివిధ దళాల అధికారులు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

సికింద్రాబాద్, తిరుమలగిరి, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): భారత నావికాదళ మాజీ చీఫ్ అడ్మిరల్ (రిటైర్డ్) లక్ష్మీనారాయణ రాందాస్ అంత్యక్రియలు శనివారం ముగిశాయి. సికింద్రాబాద్ తిరుమలగిరి ఆర్టీసీ కాలనీలోని స్వర్గ వాటిక వద్ద సైనిక లాంఛనాల మధ్య కుటుంబ సభ్యులు, త్రివిధ దళాల అధికారులు ఆయనకు తుది వీడ్కోలు పలికారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాందాస్ శుక్రవారం సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. శనివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. సైనిక లాంఛనాలలో భాగంగా అంత్యక్రియల కోసం సైనికులు అతని మృతదేహాన్ని తీసుకువచ్చారు. తుపాకీ గాలిలోకి మూడు రౌండ్లు కాల్చి సెల్యూట్ చేసింది. సర్వమత ప్రార్థనలు జరిగాయి.. అమర్ రహే.. అమర్ రహే.. ఇంక్విలాబ్ జిందాబాద్. త్రివిధ దళాలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు రాందాస్ భౌతికకాయానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అలాగే ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ , సామాజికవేత్త రమా ఎఘేతే, మీరా సంఘమిత్ర, రచయిత దివి కుమార్ , మానవ హక్కుల వేదిక నుంచి జీవన్ కుమార్ తదితర ప్రముఖులు రాందాస్ కు వీడ్కోలు పలికారు. కాగా, 1933 సెప్టెంబర్ 5న ముంబైలో జన్మించిన రాందాస్ 1953 నుంచి 1993 వరకు భారత నౌకాదళంలో వివిధ హోదాల్లో విశిష్ట సేవలందించారు.1971లో ఇండో-పాక్ యుద్ధంలో నౌకాదళ అధికారిగా కీలక పాత్ర పోషించారు. భారత ప్రభుత్వం వీర్ చక్ర అవార్డుతో సత్కరించింది. జనవరి 30, 1990న, రాందాస్ భారత నావికాదళానికి 13వ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు మరియు నౌకాదళంలో అనేక సంస్కరణలను ప్రారంభించారు.
నవీకరించబడిన తేదీ – మార్చి 17, 2024 | 05:45 AM