కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకంపై కాంగ్రెస్ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఇది దోపిడీ రాకెట్గా అభివర్ణించారు. ఈ బాండ్ల ద్వారా వచ్చిన నిధులను ప్రభుత్వాలను పడగొట్టేందుకు, పార్టీలను చీల్చేందుకు వినియోగించారని ఆరోపించారు.

ఎలక్టోరల్ బాండ్లపై రాహుల్ ఫైర్ అయ్యారు
థానే, మార్చి 16: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకంపై కాంగ్రెస్ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఇది దోపిడీ రాకెట్గా అభివర్ణించారు. ఈ బాండ్ల ద్వారా వచ్చిన నిధులను ప్రభుత్వాలను పడగొట్టేందుకు, పార్టీలను చీల్చేందుకు వినియోగించారని ఆరోపించారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా మహారాష్ట్రలోని జంబలినాక ప్రాంతంలో పర్యటించిన రాహుల్ గాంధీ ఈ సందర్భంగా ఎలక్టోరల్ బాండ్ల గురించి మాట్లాడారు. ఎలక్టోరల్ బాండ్ల పథకం.. అంతర్జాతీయ దోపిడీ రాకెట్.. ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చేందుకు, రాజకీయ పార్టీలను చీల్చేందుకు ఈ రాకెట్ను వాడుతున్నారు.. ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై ఈడీ, సీబీఐ, ఐటీ వెంటపడుతున్నాయని దుయ్యబట్టారు. మహారాష్ట్రలోని శివసేన, ఎన్సిపి ఎమ్మెల్యేలు తమ పార్టీలను విడిచిపెట్టాలని మీరు కోరుకుంటున్నారా?” అని ఆయన ప్రశ్నించారు. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ల వెంట డబ్బు ఆఫర్ చేసినప్పుడే వారందరూ వెళ్లారని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఎన్నికల బాండ్ల విషయంలో బీజేపీని విమర్శిస్తూ.. తమ పార్టీ తీసుకున్న ఎన్నికల బాండ్లను తిరిగి ఇస్తారా?.. అంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నిరసన వ్యక్తం చేశారు.ఎన్నికల కోసం నల్లధనం ద్వారా కాంగ్రెస్ పార్టీ నిధులు రాబట్టుకుందని ఫడ్నవీస్ ఆరోపించారు.రాహుల్ విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎలక్టోరల్ బాండ్ పథకం నల్లధనాన్ని అరికట్టేందుకే ఈ పథకం.
నవీకరించబడిన తేదీ – మార్చి 17, 2024 | 05:42 AM