అహ్మదాబాద్లోని గుజరాత్ యూనివర్శిటీ హాస్టల్లో నమాజ్ చేసినందుకు వివిధ దేశాల విద్యార్థులపై కొందరు దాడి చేశారని పోలీసులు ఆదివారం తెలిపారు.

గుజరాత్ యూనివర్సిటీలో ఘటన.. ఇద్దరి అరెస్ట్
అహ్మదాబాద్, మార్చి 17: అహ్మదాబాద్లోని గుజరాత్ యూనివర్శిటీ హాస్టల్లో నమాజ్ చేసినందుకు వివిధ దేశాల విద్యార్థులపై కొందరు దాడి చేశారని పోలీసులు ఆదివారం తెలిపారు. శనివారం రాత్రి ఏ-బ్లాక్ హాస్టల్లో జరిగిన ఈ ఘటనలో గాయపడిన శ్రీలంక, తజికిస్థాన్కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. దాడి చేసిన వారిలో ఇద్దరిని క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసినట్లు అహ్మదాబాద్ పోలీసులు తెలిపారు. గుజరాత్ యూనివర్సిటీలో చదువుతున్న ఐదుగురు విదేశీ విద్యార్థులు నమాజ్ చేస్తున్న సమయంలో దాడి జరిగింది. వారు ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తజికిస్థాన్, దక్షిణాఫ్రికా మరియు శ్రీలంకకు చెందినవారు. 20-25 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ఘటనపై దర్యాప్తు చేసేందుకు తొమ్మిది బృందాలను ఏర్పాటు చేశామని పోలీసు కమిషనర్ జీఎస్ మాలిక్ తెలిపారు. ఈ నేపథ్యంలో హోంశాఖ సహాయ మంత్రి హర్ష సంఘవి పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. ఈ కేసులో కఠిన చర్యలు తీసుకున్నారు. శనివారం రాత్రి 10.50 గంటల ప్రాంతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని గుజరాత్ యూనివర్సిటీ హాస్టల్లోకి ప్రవేశించి విదేశీ విద్యార్థులు నమాజ్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసి మసీదులో నమాజ్ చేయాలనుకోవడంతో ఈ ఘటన జరిగిందని మాలిక్ తెలిపారు. దీనిపై వాగ్వాదం జరగడమే కాకుండా రాళ్లతో దాడికి దిగారు. హాస్టల్ గదులను ధ్వంసం చేశారన్నారు. ఈ ఘటనలో శ్రీలంక, తజికిస్థాన్కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాళ్లు రువ్విన వీడియోలు బయటకు వచ్చాయని అంటున్నారు.
నవీకరించబడిన తేదీ – మార్చి 18, 2024 | 03:42 AM