జొహన్నెస్బర్గ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రతినిధి రాబర్ట్ ములౌడ్జీ మాట్లాడుతూ, అగ్నిప్రమాదంలో 63 మంది మరణించారు మరియు 43 మంది గాయపడ్డారు.

జోహన్నెస్బర్గ్లో అగ్ని ప్రమాదం
దక్షిణాఫ్రికాలో అగ్ని ప్రమాదం: దక్షిణాఫ్రికాలోని అతిపెద్ద నగరం జోహన్నెస్బర్గ్లోని బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 63 మంది సజీవ దహనమయ్యారు. మరో 43 మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు. మంటలు చెలరేగిన వెంటనే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో మృతుల సంఖ్య పెరిగిందని అధికారులు తెలిపారు.
అగ్ని ప్రమాదం : శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం.. 15 దుకాణాలు దగ్ధం
జొహన్నెస్బర్గ్లోని ప్రముఖ బిజినెస్ డిస్ట్రిక్ట్లోని ఓ భవనంలో మంటలు చెలరేగాయి. ఈ భవనంలో దాదాపు 200 మంది నివసిస్తున్నారు. తెల్లవారుజామున అందరూ నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో మృతుల సంఖ్య పెరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మంటలు చెలరేగిన కొద్దిసేపటికే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు అదుపులోకి తెచ్చామని, భవనం మొత్తం దట్టమైన పొగలు కమ్ముకోవడంతో సహాయక చర్యలు చేపట్టలేకపోతున్నామని అధికారులు తెలిపారు. మరికొందరు భవనంలో చిక్కుకున్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు.
అగ్నిప్రమాదం: పెళ్లిళ్లు కావాల్సిన వారు మృత్యువు ఒడిలో.. విమానం ఆలస్యం కావడంతో..
జొహన్నెస్బర్గ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రతినిధి రాబర్ట్ ములౌడ్జీ మాట్లాడుతూ, అగ్నిప్రమాదంలో 63 మంది మరణించారు మరియు 43 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని రాబర్ట్ ములాద్జీ తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇదిలావుంటే ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
తాజా అప్డేట్లో 63 మృతదేహాలు వెలికితీశారు మరియు 43 మంది గాయపడ్డారు ఇంకా శోధన మరియు పునరుద్ధరణ ఆపరేషన్ను కొనసాగిస్తున్నారు
– కోజెమ్స్ ప్రతినిధి (@RobertMulaudzi) ఆగస్టు 31, 2023